: ట్రోఫీ నేను ఇస్తా... కాదు నేనే ఇస్తా!: మెల్ బోర్న్ వేదికగా ఐసీసీ చైర్మన్, ప్రెసిడెంట్ వాదులాట

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)లో మరోసారి చిచ్చు రగిలింది. మెల్ బోర్న్ మైదానంలో ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్, ప్రెసిడెంట్ కమల్ ల మధ్య వాదులాట జరిగినట్టు తెలుస్తోంది. విజేతకు అందించే ట్రోఫీని నేను ఇస్తానంటే, నేను ఇస్తానని ఈ ఇద్దరూ వాదించుకున్నట్టు సమాచారం. ప్రోటోకాల్ ప్రకారం ట్రోఫీని తానే అందించాలని కమల్ గట్టిపట్టుతో ఉన్నట్టు తెలిసింది. వీరి గొడవను దగ్గరుండి చూసిన ఐసీసీ నేతలు 'ఔరా' అనుకున్నారట. మరి ఎవరైనా సర్దుకుంటారో లేదా ఇద్దరూ కలసి విజేతకు ట్రోఫీ ఇస్తారో చూడాలి.

More Telugu News