దావూద్ ఇబ్రహీం వల్లే క్రికెట్కు దూరం.. లలిత్ మోదీ సంచలన ఆరోపణలు!
- దావూద్ బెదిరింపుల వల్లే క్రికెట్ వీడానన్న లలిత్ మోదీ
- ఐపీఎల్ ఫ్రాంచైజీ నియంత్రణ కోసం అండర్వరల్డ్ ఒత్తిడి చేసిందని వెల్లడి
- లంచాలు తిరస్కరించడంతో మూడుసార్లు హత్యాయత్నం జరిగిందన్న మాజీ చైర్మన్
- లండన్లో అర్ధరాత్రి జరిగిన ఫోన్ కాల్ వివాదాన్ని బయటపెట్టిన లలిత్
- బెట్టింగ్ మార్కెట్ నష్టపోవడంతో డి-కంపెనీ తనపై కక్షసాధించిందని ఆరోపణ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లోకి వచ్చారు. తాను క్రికెట్ పరిపాలనా రంగానికి శాశ్వతంగా దూరం కావడానికి అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, అతడి 'డి-కంపెనీ' ముఠా నుంచి వచ్చిన ప్రాణభయమే ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు.
ఐపీఎల్ జట్టుపై పట్టు సాధించడంతో పాటు, భారీగా సాగే అక్రమ బెట్టింగ్ నెట్వర్క్లను చూసీచూడనట్లు వదిలేయాలంటూ దావూద్ ముఠా తనను తీవ్రంగా బెదిరించిందని మోదీ ఆరోపించారు. జూన్ 4న ప్రసారమైన ఏఎన్ఐ (ANI) ప్రత్యేక ఇంటర్వ్యూలో లండన్ నుంచి మాట్లాడుతూ ఆయన ఈ బాంబు పేల్చారు.
లలిత్ మోదీ కథనం ప్రకారం.. ఐపీఎల్ ప్రారంభ సీజన్లలో మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్ వంటి అక్రమాలకు తాను అస్సలు ఒప్పుకోలేదని, అందువల్లే అండర్వరల్డ్ ముఠా తనను లక్ష్యంగా చేసుకుందని చెప్పారు. ముఖ్యంగా 2009లో సార్వత్రిక ఎన్నికల భద్రత కారణంగా ఐపీఎల్ రెండో సీజన్ను ఒక్క రాత్రిలో దక్షిణాఫ్రికాకు మార్చడం వల్ల.. భారత్లో టోర్నమెంట్ రద్దవుతుందని బెట్టింగ్ కాసిన దావూద్ బుక్మేకర్ల సిండికేట్ వేల కోట్లు నష్టపోయిందని, ఆ నష్టాన్ని తన నుంచి వసూలు చేయాలని చూశారని ఆరోపించారు. ఫిక్సింగ్కు సహకరిస్తే వందల మిలియన్ డాలర్ల లంచం ఇస్తామని ఆఫర్ చేసినా తాను తిరస్కరించినట్లు తెలిపారు.
ఆ రాత్రి ఏం జరిగింది?
ఈ వివాదం ముదిరిన తరుణంలో, 2012లో లండన్లో జరిగిన ఒక భయానక సంఘటనను మోదీ గుర్తుచేసుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత 3:30 గంటల సమయంలో 'బాబా' అనే మధ్యవర్తి ద్వారా లండన్లోని ఒక పెంట్హౌస్కు తనను పిలిపించారని.. అక్కడ ఆ మధ్యవర్తి టెర్రస్ పైకి వెళ్లి శాటిలైట్ ఫోన్ ద్వారా నేరుగా దావూద్ ఇబ్రహీంకు ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేశాడని చెప్పారు. "ఐపీఎల్లో మాకు ఒక టీమ్ కావాలి, నీ సమస్యలన్నీ నేను ఒక్క నిమిషంలో తీరుస్తా" అని దావూద్ ముఠా ఒత్తిడి తెచ్చిందని, ఆ సమయంలో తాను తీవ్ర భయాందోళనలకు గురైనట్లు మోదీ అంగీకరించారు. అయినా తాను దానికి ఒప్పుకోకుండా దూరంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
తన నిరాకరణ కారణంగా దావూద్ ముఠా తనపై మూడుసార్లు హత్యాయత్నాలు చేసిందని, ముంబైలోని తన ఇంటి వెలుపల కాల్పులు జరపడంతో పాటు జోహన్నెస్బర్గ్, క్రొయేషియా సరిహద్దుల్లో హిట్మ్యాన్లను రంగంలోకి దించారని మోదీ సంచలన ఆరోపణ చేశారు. లండన్లోని స్లోన్ స్ట్రీట్లో తన కొడుకును కూడా కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు.
చివరకు డి-కంపెనీకి చెందిన చోటా షకీల్ ఒక లైవ్ ఇంటర్వ్యూలో 'లలిత్ మోదీతో సమస్యలు తీరిపోయాయి' అని ప్రకటించాడని, తాను క్రికెట్ ప్రపంచం నుంచి పూర్తిగా తప్పుకుంటానని మాట ఇవ్వడం వల్లే తన ప్రాణాలు దక్కాయని మోదీ వెల్లడించారు. కాగా, చోటా షకీల్ ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ.. ఇది కేవలం వ్యాపార ఆర్థిక లావాదేవీల వివాదం మాత్రమేనని గతంలో పేర్కొన్నారు. భారత్లో పలు ఆర్థిక నేరాల కేసులను ఎదుర్కొంటూ 2010 నుంచి లండన్లో తలదాచుకుంటున్న లలిత్ మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా, రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఐపీఎల్ జట్టుపై పట్టు సాధించడంతో పాటు, భారీగా సాగే అక్రమ బెట్టింగ్ నెట్వర్క్లను చూసీచూడనట్లు వదిలేయాలంటూ దావూద్ ముఠా తనను తీవ్రంగా బెదిరించిందని మోదీ ఆరోపించారు. జూన్ 4న ప్రసారమైన ఏఎన్ఐ (ANI) ప్రత్యేక ఇంటర్వ్యూలో లండన్ నుంచి మాట్లాడుతూ ఆయన ఈ బాంబు పేల్చారు.
లలిత్ మోదీ కథనం ప్రకారం.. ఐపీఎల్ ప్రారంభ సీజన్లలో మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్ వంటి అక్రమాలకు తాను అస్సలు ఒప్పుకోలేదని, అందువల్లే అండర్వరల్డ్ ముఠా తనను లక్ష్యంగా చేసుకుందని చెప్పారు. ముఖ్యంగా 2009లో సార్వత్రిక ఎన్నికల భద్రత కారణంగా ఐపీఎల్ రెండో సీజన్ను ఒక్క రాత్రిలో దక్షిణాఫ్రికాకు మార్చడం వల్ల.. భారత్లో టోర్నమెంట్ రద్దవుతుందని బెట్టింగ్ కాసిన దావూద్ బుక్మేకర్ల సిండికేట్ వేల కోట్లు నష్టపోయిందని, ఆ నష్టాన్ని తన నుంచి వసూలు చేయాలని చూశారని ఆరోపించారు. ఫిక్సింగ్కు సహకరిస్తే వందల మిలియన్ డాలర్ల లంచం ఇస్తామని ఆఫర్ చేసినా తాను తిరస్కరించినట్లు తెలిపారు.
ఆ రాత్రి ఏం జరిగింది?
ఈ వివాదం ముదిరిన తరుణంలో, 2012లో లండన్లో జరిగిన ఒక భయానక సంఘటనను మోదీ గుర్తుచేసుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత 3:30 గంటల సమయంలో 'బాబా' అనే మధ్యవర్తి ద్వారా లండన్లోని ఒక పెంట్హౌస్కు తనను పిలిపించారని.. అక్కడ ఆ మధ్యవర్తి టెర్రస్ పైకి వెళ్లి శాటిలైట్ ఫోన్ ద్వారా నేరుగా దావూద్ ఇబ్రహీంకు ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేశాడని చెప్పారు. "ఐపీఎల్లో మాకు ఒక టీమ్ కావాలి, నీ సమస్యలన్నీ నేను ఒక్క నిమిషంలో తీరుస్తా" అని దావూద్ ముఠా ఒత్తిడి తెచ్చిందని, ఆ సమయంలో తాను తీవ్ర భయాందోళనలకు గురైనట్లు మోదీ అంగీకరించారు. అయినా తాను దానికి ఒప్పుకోకుండా దూరంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
తన నిరాకరణ కారణంగా దావూద్ ముఠా తనపై మూడుసార్లు హత్యాయత్నాలు చేసిందని, ముంబైలోని తన ఇంటి వెలుపల కాల్పులు జరపడంతో పాటు జోహన్నెస్బర్గ్, క్రొయేషియా సరిహద్దుల్లో హిట్మ్యాన్లను రంగంలోకి దించారని మోదీ సంచలన ఆరోపణ చేశారు. లండన్లోని స్లోన్ స్ట్రీట్లో తన కొడుకును కూడా కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు.
చివరకు డి-కంపెనీకి చెందిన చోటా షకీల్ ఒక లైవ్ ఇంటర్వ్యూలో 'లలిత్ మోదీతో సమస్యలు తీరిపోయాయి' అని ప్రకటించాడని, తాను క్రికెట్ ప్రపంచం నుంచి పూర్తిగా తప్పుకుంటానని మాట ఇవ్వడం వల్లే తన ప్రాణాలు దక్కాయని మోదీ వెల్లడించారు. కాగా, చోటా షకీల్ ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ.. ఇది కేవలం వ్యాపార ఆర్థిక లావాదేవీల వివాదం మాత్రమేనని గతంలో పేర్కొన్నారు. భారత్లో పలు ఆర్థిక నేరాల కేసులను ఎదుర్కొంటూ 2010 నుంచి లండన్లో తలదాచుకుంటున్న లలిత్ మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా, రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.