పెట్రోల్ కొరతపై వైసీపీదే కుట్ర: మంత్రి పార్థసారథి
- పెట్రోల్ కొరతపై వైసీపీ భయాందోళనలు సృష్టిస్తోందన్న మంత్రి పార్ధసారధి
- మంగళవారం నాటికే 75 శాతం బంకుల్లో ఇంధన సరఫరా పూర్తి
- గూగుల్ రాకను చూసి ఓర్వలేకే వైసీపీ ప్రజల దృష్టిని మళ్లిస్తోందని వ్యాఖ్య
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతపై ప్రతిపక్ష వైసీపీ భయాందోళనలు సృష్టిస్తోందని ఏపీ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రంగా విమర్శించారు. కృష్ణా జిల్లా కారకంపాడులో మాట్లాడిన ఆయన, మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకే కొరత ఉన్న 75 శాతం బంకుల్లో ఇంధన సరఫరా పూర్తి చేశామని, బుధవారానికి పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందని స్పష్టం చేశారు.
విశాఖపట్నంలో గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థ శంకుస్థాపన చేస్తుంటే, ఆ అభివృద్ధిని చూసి ఓర్వలేకే వైసీపీ ప్రజల దృష్టిని మళ్లించేందుకు కుట్ర చేస్తోందని మంత్రి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి రూ. 9 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దేశంలోని పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వస్తున్నాయని తెలిపారు. ఈ వాస్తవాలు వైసీపీ నేతలకు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు.
ప్రతిపక్షం ప్రజల్లో అనవసరమైన ఆందోళన కలిగించడం వల్లే వినియోగదారులు అధికంగా ఇంధనం కొనుగోలు చేస్తున్నారని, ఇదే కృత్రిమ కొరతకు కారణమవుతోందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమస్యపై రోజూ సమీక్ష నిర్వహిస్తూ పరిస్థితిని చక్కదిద్దుతున్నారని తెలిపారు.
గత ప్రభుత్వం ఆరు నెలల్లో చెల్లించలేని రైతు బకాయిలను తాము 48 గంటల్లోనే చెల్లించామని మంత్రి గుర్తుచేశారు. రైతాంగ వ్యవస్థలను చిన్నాభిన్నం చేసి, ఇప్పుడు వైసీపీ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
విశాఖపట్నంలో గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థ శంకుస్థాపన చేస్తుంటే, ఆ అభివృద్ధిని చూసి ఓర్వలేకే వైసీపీ ప్రజల దృష్టిని మళ్లించేందుకు కుట్ర చేస్తోందని మంత్రి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి రూ. 9 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దేశంలోని పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వస్తున్నాయని తెలిపారు. ఈ వాస్తవాలు వైసీపీ నేతలకు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు.
ప్రతిపక్షం ప్రజల్లో అనవసరమైన ఆందోళన కలిగించడం వల్లే వినియోగదారులు అధికంగా ఇంధనం కొనుగోలు చేస్తున్నారని, ఇదే కృత్రిమ కొరతకు కారణమవుతోందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమస్యపై రోజూ సమీక్ష నిర్వహిస్తూ పరిస్థితిని చక్కదిద్దుతున్నారని తెలిపారు.
గత ప్రభుత్వం ఆరు నెలల్లో చెల్లించలేని రైతు బకాయిలను తాము 48 గంటల్లోనే చెల్లించామని మంత్రి గుర్తుచేశారు. రైతాంగ వ్యవస్థలను చిన్నాభిన్నం చేసి, ఇప్పుడు వైసీపీ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.