రేపటి నుంచి పెంచలకోన బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

  • పెంచలకోన బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
  • సీఎంను కలిసి ఆహ్వాన పత్రిక అందించిన ఎమ్మెల్యే కురుగొండ్ల
  • ఈనెల 27 నుంచి మే 3 వరకు జరగనున్న ఉత్సవాలు
  • ముఖ్యమంత్రికి స్వామివారి ప్రసాదాన్ని, ఆశీర్వచనం అందించిన అర్చకులు
  • ఉత్సవాల ఏర్పాట్లపై ఆరా తీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబును నెల్లూరు జిల్లా పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాల్సిందిగా ప్రత్యేకంగా ఆహ్వానించారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, ఆలయ పాలకమండలి ఛైర్మన్ తిరుపాల్ రెడ్డి సోమవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఈ సందర్భంగా, ఈ నెల 27 నుంచి మే 3వ తేదీ వరకు వైభవంగా జరగనున్న పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు తప్పనిసరిగా రావాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. వారి వెంట వచ్చిన ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వేదాశీర్వచనం అందించి, స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని బహూకరించారు.

ఆహ్వానాన్ని స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల గురించి ఎమ్మెల్యేను, ఆలయ ఛైర్మన్‌ను అడిగి తెలుసుకున్నారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆయన సూచించినట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు.

Chandrababu Naidu
Penchalakona Brahmotsavam
Nellore District
Sri Penusila Lakshmi Narasimha Swamy
Kurugondla Ramakrishna
Temple Festival
Andhra Pradesh Temples
Hindu Festival

More Telugu News