ధురంధర్-2 వివాదం... సారీ చెప్పిన మాధవన్
రణవీర్ సింగ్, ఆదిత్య ధర్ కాంబోల వచ్చిన ధురంధర్-2 బాక్సాఫీసు వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే ఈ చిత్రంపై వివాదాలు కూడా ఉన్నాయి. తాజాగా, తనపై వచ్చిన వివాదం పట్ల నటుడు మాధవన్ వివరణ ఇచ్చారు. ఈ చిత్రంలో మాధవన్ కీలక పాత్ర పోషించడం తెలిసిందే. ఈ చిత్రంలోని ఒక సన్నివేశంలో మాధవన్ సిగరెట్ చేతిలో ఉండగా, సిక్కుల పవిత్ర గ్రంథంలోని గుర్బానీ వచనాన్ని పఠించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ వివాదంపై స్పందించిన మాధవన్, ఎవరి మనోభావాలను దెబ్బతీయాలన్న ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేస్తూ క్షమాపణలు తెలిపారు.
ఈ విషయంపై మాధవన్ వివరణ ఇస్తూ, "ఇది కేవలం అపార్థం మాత్రమే. ఆ సన్నివేశంలో పవిత్రమైన డైలాగ్ చెప్పడానికి చాలా ముందే నేను సిగరెట్ను పూర్తిగా ఆర్పివేశాను. ఈ విషయాల్లో నాకంటే మా దర్శకుడు ఆదిత్య ధర్ ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. ఆ డైలాగ్ చెప్పేటప్పుడు చేతిలో సిగరెట్ ఉండకూడదని, నోటి నుంచి పొగ రాకూడదని ఆయన స్పష్టంగా చెప్పారు" అని తెలిపారు. సన్నివేశం ప్రారంభంలో తన చేతిలో సిగరెట్ ఉన్న మాట వాస్తవమే అయినా, డైలాగ్ చెప్పే సమయానికి అది లేదని ఆయన పేర్కొన్నారు.
సిక్కు సమాజంపై తమకు అపారమైన గౌరవం ఉందని మాధవన్ అన్నారు. "ప్రతి సినిమా విడుదలకు ముందు నేను గోల్డెన్ టెంపుల్కు వెళతానని అందరికీ తెలుసు. కాబట్టి మమ్మల్ని నమ్మండి, ఎవరినీ నొప్పించాలని మేము అనుకోలేదు" అని ఆయన వివరించారు.
కాగా, 'ధురంధర్ 2' చిత్రబృందం సిక్కు మత మనోభావాలను కించపరిచిందంటూ ముంబైలో పోలీసులకు ఫిర్యాదు కూడా అందింది. ఈ నేపథ్యంలో, తెలిసి గానీ, తెలియక గానీ ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించాలని మాధవన్ కోరారు.
ఈ విషయంపై మాధవన్ వివరణ ఇస్తూ, "ఇది కేవలం అపార్థం మాత్రమే. ఆ సన్నివేశంలో పవిత్రమైన డైలాగ్ చెప్పడానికి చాలా ముందే నేను సిగరెట్ను పూర్తిగా ఆర్పివేశాను. ఈ విషయాల్లో నాకంటే మా దర్శకుడు ఆదిత్య ధర్ ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. ఆ డైలాగ్ చెప్పేటప్పుడు చేతిలో సిగరెట్ ఉండకూడదని, నోటి నుంచి పొగ రాకూడదని ఆయన స్పష్టంగా చెప్పారు" అని తెలిపారు. సన్నివేశం ప్రారంభంలో తన చేతిలో సిగరెట్ ఉన్న మాట వాస్తవమే అయినా, డైలాగ్ చెప్పే సమయానికి అది లేదని ఆయన పేర్కొన్నారు.
సిక్కు సమాజంపై తమకు అపారమైన గౌరవం ఉందని మాధవన్ అన్నారు. "ప్రతి సినిమా విడుదలకు ముందు నేను గోల్డెన్ టెంపుల్కు వెళతానని అందరికీ తెలుసు. కాబట్టి మమ్మల్ని నమ్మండి, ఎవరినీ నొప్పించాలని మేము అనుకోలేదు" అని ఆయన వివరించారు.
కాగా, 'ధురంధర్ 2' చిత్రబృందం సిక్కు మత మనోభావాలను కించపరిచిందంటూ ముంబైలో పోలీసులకు ఫిర్యాదు కూడా అందింది. ఈ నేపథ్యంలో, తెలిసి గానీ, తెలియక గానీ ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించాలని మాధవన్ కోరారు.