పశ్చిమాసియా పరిస్థితులు... రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రకటన
పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో, గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయుల భద్రతే ప్రథమ ప్రాధాన్యతగా తీసుకున్నామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఆయా దేశాల్లో చిక్కుకున్న మనవారిని సురక్షితంగా తీసుకువచ్చామని తెలిపారు. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులపై ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ, పశ్చిమాసియా పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని అన్నారు.
అక్కడ యుద్ధం జరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక సమస్యలు వస్తున్నాయని, ఇంధన సంక్షోభానికి దారితీసిందని ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశంలో ముడి చమురు, గ్యాస్, ఎరువుల రవాణాకు ఎలాంటి ఇబ్బందిలేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం మనకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని తెలిపారు. మరోవైపు, హర్మూజ్ జలసంధి మీదుగా భారత చమురు నౌకలు వస్తున్నాయని వెల్లడించారు.
ఆ నౌకలు సురక్షితంగా మన పోర్టులకు చేరేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా అక్కడి నుంచి 3.54 లక్షల మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చామని అన్నారు. ఈ దాడుల్లో కొంతమంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారని సభకు తెలిపారు. గల్ఫ్ దేశాలతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. సమస్యలకు చర్చలు, సంప్రదింపులే ఏకైక పరిష్కారమని ప్రధాని మోదీ అన్నారు.
అక్కడ యుద్ధం జరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక సమస్యలు వస్తున్నాయని, ఇంధన సంక్షోభానికి దారితీసిందని ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశంలో ముడి చమురు, గ్యాస్, ఎరువుల రవాణాకు ఎలాంటి ఇబ్బందిలేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం మనకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని తెలిపారు. మరోవైపు, హర్మూజ్ జలసంధి మీదుగా భారత చమురు నౌకలు వస్తున్నాయని వెల్లడించారు.
ఆ నౌకలు సురక్షితంగా మన పోర్టులకు చేరేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా అక్కడి నుంచి 3.54 లక్షల మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చామని అన్నారు. ఈ దాడుల్లో కొంతమంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారని సభకు తెలిపారు. గల్ఫ్ దేశాలతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. సమస్యలకు చర్చలు, సంప్రదింపులే ఏకైక పరిష్కారమని ప్రధాని మోదీ అన్నారు.