విశాఖలో నటి శ్రుతి హాసన్ సంద‌డి.. ఆమెను చూసేందుకు ఎగ‌బ‌డ్డ ఫ్యాన్స్‌

విశాఖపట్నంలో నటి శ్రుతి హాసన్ సందడి చేశారు. ఓ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ షోరూంను ఆమె ప్రారంభించారు. ఇక‌, త‌మ అభిమాన న‌టి షోరూం ప్రారంభోత్స‌వానికి రావ‌డంతో ఆమెను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. షోరూం ప్రారంభోత్సవం అనంతరం శ్రుతి హాసన్ అభిమానులతో సెల్ఫీలు దిగారు. ఈ కార్య‌క్ర‌మంలో శ్రుతి హాస‌న్‌తో పాటు ఎమ్మెల్యేలు సి.హెచ్. వంశీ కృష్ణ, వి. రామకృష్ణ బాబు కూడా పాల్గొన్నారు. 


More Telugu News