ఎన్టీఆర్ 'ఆరాధన'కి దర్శకుడిగా కె.విశ్వనాథ్ చేయవలసిందట!

ఎన్టీఆర్ - వాణిశ్రీ నాయకా నాయికలుగా నటించిన 'ఆరాధన', 1976లో మార్చి 12వ తేదీన విడుదలైంది. బీవీ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అట్లూరి పుండరీ కాక్షయ్య నిర్మించారు. ఈ నెల 12వ తేదీతో ఈ సినిమా 50 ఏళ్లను పూర్తిచేసుకుంది.ఈ సందర్భంగా పుండరీకాక్షయ్య తనయుడు నాగేశ్వరావు, ఈ సినిమాకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. 

హిందీలో 'గీత్' సినిమాను తెలుగులో చేయడానికి రైట్స్ తీసుకున్నాము. రైట్స్ ఇచ్చేవారు కూడా, ఎన్టీఆర్ కి గల ఇమేజ్ వేరు .. ఈ కాన్సెప్ట్ వేరు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ఇండస్ట్రీ నుంచి కూడా ఎక్కువగా విమర్శలే వినిపించాయి. ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అలాంటి ఆయనను మూగవాడిగా చూస్తారా? అనే ఒక టాక్ వినిపించింది. నాన్నగారు ఈ సినిమాకి కె విశ్వనాథ్ గారిని దర్శకుడిగా అనుకున్నారు. ఆయనకి అడ్వాన్స్ కూడా ఇచ్చారు" అని అన్నారు. 

'గీత్' సినిమాను చూసిన విశ్వనాథ్ గారు, మన నేటివిటీకి తగినట్టుగా ఈ కథను మార్చాలని అన్నారు. అందుకు నాన్నగారు ఒప్పుకోలేదు. హిందీలో ఎలాగైతే ఉందో అలాగే ఉండాలని అన్నారు. అయితే తాము మరో ప్రాజెక్టును కలిసి చేద్దామని విశ్వనాథ్ గారు తప్పుకున్నారు. అప్పుడు ఆల్రెడీ మాకు పరిచయమున్న బీవీ ప్రసాద్ గారి దగ్గరికి ఈ ప్రాజెక్టు వెళ్లింది. 'కులుమనాలి'లో వాతావరణం అనుకూలించకపోయినా, ఎన్టీఆర్ గారి సహకారంతో ఆ సినిమాను పూర్తి చేయగలిగాము" అని అన్నారు. 



More Telugu News