తెలంగాణలో రానున్న నాలుగు రోజులు వర్షాలు.. పలు జిల్లాలకు హెచ్చరిక
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురుతో పాటు కీలక హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఈ అకాల వర్షాలు పడుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వాతావరణ శాఖ సూచన ప్రకారం.. రానున్న కొన్ని గంటల్లో రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, వికారాబాద్, గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు.
హైదరాబాద్పై కారుమబ్బులు.. భారీ వర్ష సూచన
ఇక, హైదరాబాద్పైనా వాతావరణ శాఖ ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ హైదరాబాద్ ప్రాంతంపై భారీ ఉరుములతో కూడిన తుపాను మేఘాలు కమ్ముకున్నాయని తెలిపింది. మహేశ్వరం, షాద్నగర్ మీదుగా వస్తున్న ఈ మేఘాలు ఇప్పటికే నగరాన్ని తాకాయని, దీని ప్రభావంతో శంషాబాద్, రాజేంద్రనగర్, బహదూరుపురా, కార్వాన్, కాటేదాన్, చంద్రాయణగుట్ట, చార్మినార్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, బండ్లగూడ జాగీర్ వంటి ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు విస్తరించనుందని అంచనా వేశారు. ఇప్పటికే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట వంటి ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
ఈ అకాల వర్షాల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఉండరాదని హెచ్చరించారు. బలమైన గాలుల వల్ల హోర్డింగులు, పాత చెట్లు కూలిపోయే ప్రమాదం ఉన్నందున అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని చెబుతున్నారు. అదేవిధంగా కోతకు సిద్ధంగా ఉన్న పంటలు, ఆరబోసిన ధాన్యం విషయంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
వాతావరణ శాఖ సూచన ప్రకారం.. రానున్న కొన్ని గంటల్లో రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, వికారాబాద్, గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు.
హైదరాబాద్పై కారుమబ్బులు.. భారీ వర్ష సూచన
ఇక, హైదరాబాద్పైనా వాతావరణ శాఖ ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ హైదరాబాద్ ప్రాంతంపై భారీ ఉరుములతో కూడిన తుపాను మేఘాలు కమ్ముకున్నాయని తెలిపింది. మహేశ్వరం, షాద్నగర్ మీదుగా వస్తున్న ఈ మేఘాలు ఇప్పటికే నగరాన్ని తాకాయని, దీని ప్రభావంతో శంషాబాద్, రాజేంద్రనగర్, బహదూరుపురా, కార్వాన్, కాటేదాన్, చంద్రాయణగుట్ట, చార్మినార్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, బండ్లగూడ జాగీర్ వంటి ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు విస్తరించనుందని అంచనా వేశారు. ఇప్పటికే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట వంటి ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
ఈ అకాల వర్షాల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఉండరాదని హెచ్చరించారు. బలమైన గాలుల వల్ల హోర్డింగులు, పాత చెట్లు కూలిపోయే ప్రమాదం ఉన్నందున అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని చెబుతున్నారు. అదేవిధంగా కోతకు సిద్ధంగా ఉన్న పంటలు, ఆరబోసిన ధాన్యం విషయంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.