శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం.. శిలాతోరణం వరకు క్యూలైన్లు

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి, క్యూలైన్లు వెలుపల ఉన్న శిలాతోరణం వరకు విస్తరించాయి. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు మంగళవారం తెలిపారు.

నిన్న సోమవారం (మార్చి 16) ఒక్కరోజే 70,606 మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లు టీటీడీ వెల్లడించింది. అదేవిధంగా, 28,415 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.39 కోట్లుగా నమోదైంది.

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. 

కాగా, భక్తులు తమ ప్రయాణ ప్రణాళికలో ఈ రద్దీని దృష్టిలో ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


More Telugu News