ప్రయాణికులకు ఎయిరిండియా గుడ్న్యూస్.. భారీగా ప్రత్యేక సర్వీసులు
పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని యూరప్, ఉత్తర అమెరికాకు అదనపు విమాన సర్వీసులను నడపనున్నట్లు ఎయిరిండియా మంగళవారం ప్రకటించింది. ఈ నిర్ణయంతో కీలక మార్గాల్లో వేల సంఖ్యలో అదనపు సీట్లు అందుబాటులోకి రానున్నాయి.
వివరాల్లోకి వెళితే... ఈ నెల 19 నుంచి 28 మధ్య ఢిల్లీ, ముంబైల నుంచి లండన్ (హీత్రూ), టొరంటో, ఫ్రాంక్ఫర్ట్, జ్యూరిచ్ వంటి ప్రధాన నగరాలకు 36 అదనపు విమానాలను ఆపరేట్ చేయనుంది. ఈ ప్రత్యేక సర్వీసుల ద్వారా దాదాపు 10,000కు పైగా సీట్లను ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే ఈ నెల 10 నుంచి 18 వరకు 78 అదనపు సర్వీసులను నడిపినట్లు ఎయిరిండియా గుర్తుచేసింది.
ప్రస్తుత భౌగోళిక, రాజకీయ పరిస్థితుల కారణంగా కొన్ని విమానయాన మార్గాలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ గగనతలాన్ని మూసివేయడంతో విమానాలు సుదీర్ఘ మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఎయిరిండియా సుదూర విమానాల సిబ్బంది విధివిధానాల్లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తాత్కాలికంగా కొన్ని సడలింపులు ఇచ్చింది.
మరోవైపు ఇండిగో సంస్థ కూడా ఈ నెల 16 నుంచి 28 మధ్య పశ్చిమాసియాకు 252 వీక్లీ విమానాలు నడుపుతున్నట్లు గత వారం ప్రకటించింది. అయితే దోహా, కువైట్, బహ్రెయిన్ వంటి కొన్ని గల్ఫ్ దేశాలకు మాత్రం సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ అదనపు విమానాలకు సంబంధించిన బుకింగ్లను తమ అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్తో పాటు అధీకృత ఏజెంట్ల ద్వారా దశలవారీగా ప్రారంభిస్తున్నట్లు ఎయిరిండియా వెల్లడించింది.
వివరాల్లోకి వెళితే... ఈ నెల 19 నుంచి 28 మధ్య ఢిల్లీ, ముంబైల నుంచి లండన్ (హీత్రూ), టొరంటో, ఫ్రాంక్ఫర్ట్, జ్యూరిచ్ వంటి ప్రధాన నగరాలకు 36 అదనపు విమానాలను ఆపరేట్ చేయనుంది. ఈ ప్రత్యేక సర్వీసుల ద్వారా దాదాపు 10,000కు పైగా సీట్లను ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే ఈ నెల 10 నుంచి 18 వరకు 78 అదనపు సర్వీసులను నడిపినట్లు ఎయిరిండియా గుర్తుచేసింది.
ప్రస్తుత భౌగోళిక, రాజకీయ పరిస్థితుల కారణంగా కొన్ని విమానయాన మార్గాలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ గగనతలాన్ని మూసివేయడంతో విమానాలు సుదీర్ఘ మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఎయిరిండియా సుదూర విమానాల సిబ్బంది విధివిధానాల్లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తాత్కాలికంగా కొన్ని సడలింపులు ఇచ్చింది.
మరోవైపు ఇండిగో సంస్థ కూడా ఈ నెల 16 నుంచి 28 మధ్య పశ్చిమాసియాకు 252 వీక్లీ విమానాలు నడుపుతున్నట్లు గత వారం ప్రకటించింది. అయితే దోహా, కువైట్, బహ్రెయిన్ వంటి కొన్ని గల్ఫ్ దేశాలకు మాత్రం సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ అదనపు విమానాలకు సంబంధించిన బుకింగ్లను తమ అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్తో పాటు అధీకృత ఏజెంట్ల ద్వారా దశలవారీగా ప్రారంభిస్తున్నట్లు ఎయిరిండియా వెల్లడించింది.