'ఉస్తాద్ భగత్ సింగ్'... తమిళనాడులోని అన్ని ప్రాంతాల్లో రిలీజ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోనూ భారీ ఎత్తున విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు.
ఉగాది పండుగ కానుకగా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా తమిళనాడు పంపిణీ హక్కులను ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ ఏజీఎస్ సినిమాస్ దక్కించుకుంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. పవన్ కల్యాణ్ సినిమాను తమిళనాడు వ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో అక్కడి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్బస్టర్ తర్వాత పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో 'ఉస్తాద్ భగత్ సింగ్'పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.
ఉగాది పండుగ కానుకగా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా తమిళనాడు పంపిణీ హక్కులను ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ ఏజీఎస్ సినిమాస్ దక్కించుకుంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. పవన్ కల్యాణ్ సినిమాను తమిళనాడు వ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో అక్కడి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్బస్టర్ తర్వాత పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో 'ఉస్తాద్ భగత్ సింగ్'పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.