దుబాయ్ ఎయిర్పోర్ట్పై డ్రోన్ దాడి.. భారీ అగ్నిప్రమాదం, విమాన సర్వీసుల బంద్!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఓ డ్రోన్ దాడి కలకలం రేపింది. ఈ దాడిలో ఎయిర్పోర్ట్కు చెందిన ఫ్యూయల్ ట్యాంక్ను లక్ష్యంగా చేసుకోవడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వెంటనే రంగంలోకి దిగిన సివిల్ డిఫెన్స్ బృందాలు మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు.
దుబాయ్ మీడియా ఆఫీస్ ఈ ఘటనను ధ్రువీకరించింది. "దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో డ్రోన్ ఘటన కారణంగా ఫ్యూయల్ ట్యాంక్లలో ఒకదానిపై ప్రభావం పడింది. సివిల్ డిఫెన్స్ బృందాలు మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చాయి. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు" అని ఓ ప్రకటనలో పేర్కొంది.
ముందుజాగ్రత్త చర్యగా దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్లో విమానాల రాకపోకలు ఆగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికులు, సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
అయితే, ఈ డ్రోన్ దాడికి ఎవరు బాధ్యులు అనేదానిపై యూఏఈ అధికారులు అధికారికంగా ఎవరి పేరునూ వెల్లడించలేదు. కానీ, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ దాడి వెనుక ఇరాన్ హస్తం ఉండవచ్చని పలు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ప్రయాణికులు తమ విమాన సర్వీసుల సమాచారం కోసం సంబంధిత ఎయిర్లైన్స్ను సంప్రదించాలని అధికారులు సూచించారు.
దుబాయ్ మీడియా ఆఫీస్ ఈ ఘటనను ధ్రువీకరించింది. "దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో డ్రోన్ ఘటన కారణంగా ఫ్యూయల్ ట్యాంక్లలో ఒకదానిపై ప్రభావం పడింది. సివిల్ డిఫెన్స్ బృందాలు మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చాయి. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు" అని ఓ ప్రకటనలో పేర్కొంది.
ముందుజాగ్రత్త చర్యగా దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్లో విమానాల రాకపోకలు ఆగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికులు, సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
అయితే, ఈ డ్రోన్ దాడికి ఎవరు బాధ్యులు అనేదానిపై యూఏఈ అధికారులు అధికారికంగా ఎవరి పేరునూ వెల్లడించలేదు. కానీ, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ దాడి వెనుక ఇరాన్ హస్తం ఉండవచ్చని పలు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ప్రయాణికులు తమ విమాన సర్వీసుల సమాచారం కోసం సంబంధిత ఎయిర్లైన్స్ను సంప్రదించాలని అధికారులు సూచించారు.