Nara Lokesh: రేవేంద్రపాడులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్

Nara Lokesh Unveils NTR Statue in Revendrapadu
  • మంత్రి నారా లోకేశ్ ఘనస్వాగతం పలికిన స్థానికులు, టీడీపీ శ్రేణులు
  • భారీ ర్యాలీ మధ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన విద్యా, ఐటీ శాఖల మంత్రి
  • ఎన్టీఆర్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు
  • కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు
మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ నేడు లాంఛనంగా ఆవిష్కరించారు.

ఇవాళ రేవేంద్రపాడు చేరుకున్న మంత్రి లోకేశ్ కు స్థానిక ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ మధ్య ఉత్సాహభరిత వాతావరణంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరిగింది. విగ్రహావిష్కరణ తరువాత అక్కడ ఉన్న ఎన్టీఆర్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు లోకేశ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమానికి వచ్చిన అభిమానులు, కార్యకర్తలతో ఆయన కాసేపు ముచ్చటించి, వారితో కలిసి ఫోటోలు దిగారు.

ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, దుగ్గిరాల మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కాసరనేని జశ్వంత్, దుగ్గిరాల మండల టీడీపీ అధ్యక్షురాలు కేశినేని శ్రీఅనిత తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, స్థానికులు తరలిరావడంతో రేవేంద్రపాడులో కోలాహలం నెలకొంది.
Nara Lokesh
NTR statue
Revendrapadu
Mangalagiri
Duggirala
Andhra Pradesh politics
TDP
Statue unveiling
Pothineni Srinivasarao
Kesineni Sri Anitha

More Telugu News