సింగపూర్ నుంచి చైనాకు వెళుతున్న నౌకలో భారత అధికారి అదృశ్యం

  • మర్చంట్ నేవీ అధికారి సార్ధక్ మహాపాత్రో అదృశ్యం
  • ఫిబ్రవరి 2న తల్లిదండ్రులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడిన నేవీ అధికారి
  • మరుసటి రోజు నుంచి అదృశ్యం
సింగపూర్ నుంచి చైనా వెళుతున్న నౌకలోని భారత్‌కు చెందిన మర్చంట్ నేవీ అధికారి ఒకరు అదృశ్యమయ్యారు. గత ఏడాది జులైలో ఒక ప్రైవేటు షిప్పింగ్ కంపెనీలో ఒడిశాకు చెందిన సార్ధక్ మహాపాత్రో ఉద్యోగంలో చేరాడు. అతడు ప్రయాణిస్తున్న నౌక సింగపూర్ నుంచి చైనాకు తిరిగి వస్తోంది. ఫిబ్రవరి 2వ తేదీన తల్లిదండ్రులు, స్నేహితుల అతడు వీడియో కాల్ ద్వారా మాట్లాడాడు.

మరుసటి రోజు నుంచి అతడిని సంప్రదించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. సార్ధక్ కనిపించడం లేదని ఆ తర్వాత షిప్పింగ్ కంపెనీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. సార్ధక్ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని, తన కొడుకును త్వరగా తీసుకురావాలని సార్ధక్ తల్లి విజ్ఞప్తి చేశారు.


More Telugu News