అండ‌ర్‌-19 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో భారత్-ఇంగ్లండ్ పోరు.. టాస్ గెలిచిన టీమిండియా

  • తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్న భారత్
  • పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందన్న‌ కెప్టెన్ ఆయుష్ మాత్రే 
  • ఎలాంటి మార్పులు చేయ‌ని భారత జట్టు.. ఇంగ్లండ్ జట్టులో ఒక మార్పు
అండ‌ర్‌-19 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో ఇంగ్లండ్‌పై భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ చాలా బాగుందని భారత కెప్టెన్ ఆయుష్ మాత్రే తెలిపాడు. ఈ సందర్భంగా మాత్రే మాట్లాడుతూ, "మేం సహజంగా, సింపుల్‌గా ఆడతాం. అనవసరంగా విషయాలను సంక్లిష్టం చేసుకోం" అని తన వ్యూహాన్ని వెల్లడించాడు. భారత జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేశాడు.

మరోవైపు తాము టాస్ గెలిచి ఉంటే బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని ఇంగ్లండ్ కెప్టెన్ థామస్ ర్యూ అన్నాడు. "వికెట్ బాగుంది. మ్యాచ్ చివరి వరకు ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నాం. పరిస్థితులకు ఎంత త్వరగా అలవాటుపడతామన్నదే కీలకం. కుర్రాళ్లపై ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం" అని రివ్యూ వివరించాడు. ఇంగ్లండ్ జట్టులో ఒక మార్పు చోటుచేసుకుంది. అలెక్స్ ఫ్రెంచ్ స్థానంలో అలెక్స్ గ్రీన్ జట్టులోకి వచ్చాడు.

జట్ల వివరాలు:
భారత్: ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే  (కెప్టెన్), విహాన్ మల్హోత్రా, అభిజ్ఞాన్‌ కుందు (వికెట్ కీపర్), వేదాంత్ త్రివేది, ఆర్ఎస్ అంబరీశ్‌, కనిష్క్ చౌహాన్, ఖిలన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేశ్‌ దేవేంద్రన్.
ఇంగ్లండ్: బెన్ డాకిన్స్, జోసెఫ్ మూర్స్, బెన్ మాయెస్, థామస్ ర్యూ (కెప్టెన్, వికెట్ కీపర్), కాలెబ్ ఫాల్కనర్, రాల్ఫీ అల్బర్ట్, ఫర్హాన్ అహ్మద్, సెబాస్టియన్ మోర్గాన్, జేమ్స్ మింటో, మ్యానీ లమ్స్‌డెన్, అలెక్స్ గ్రీన్.


More Telugu News