'యానిమల్‌' సీక్వెల్‌పై అప్‌డేట్‌ ఇచ్చిన సందీప్‌ వంగా

రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన 'యానిమల్‌' సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'యానిమల్‌ పార్క్‌' ఉంటుందని గతంలోనే ప్రకటించిన మేకర్స్, తాజాగా దానిపై ఓ కీలక అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ సీక్వెల్ షూటింగ్ 2027లో మొదలుపెట్టి, 2028లో సినిమాను విడుదల చేస్తామని దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా స్పష్టం చేశారు.

ప్రస్తుతం 'యానిమల్' చిత్రాన్ని జపాన్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఫిబ్రవరి 13న ఈ సినిమా అక్కడ రిలీజ్ కానున్న నేపథ్యంలో హీరో రణ్‌బీర్‌ కపూర్‌, దర్శకుడు సందీప్‌ రెడ్డి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జపాన్‌లోని అభిమానులతో ముచ్చటించిన సందీప్ రెడ్డి, 'యానిమల్' సీక్వెల్‌పై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు.

'యానిమల్‌ పార్క్‌' కచ్చితంగా ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. సినిమా షూటింగ్‌కు, విడుదలకు సంబంధించిన స్పష్టమైన ప్రణాళికను వెల్లడించడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. 'యానిమల్' సాధించిన భారీ విజయంతో సీక్వెల్‌పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు దర్శకుడే నేరుగా టైమ్‌లైన్‌ ప్రకటించడంతో ఈ ప్రాజెక్ట్‌పై మరింత స్పష్టత వచ్చింది.


More Telugu News