Ambati Rambabu: సీఎం చంద్రబాబుపై అంబటి అసభ్య వ్యాఖ్యలు.. గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు
- సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు తీవ్ర అసభ్య వ్యాఖ్యలు
- గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేసిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు
- లడ్డూ నెయ్యి కల్తీ ఫ్లెక్సీపై మొదలైన వివాదం
- గోరంట్లలో అంబటిని అడ్డుకున్న టీడీపీ శ్రేణులు
- అంబటి వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమన్న మంత్రి పార్థసారథి
ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర అసభ్య పదజాలంతో దూషణలకు దిగిన మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు శనివారం జిల్లా ఎస్పీకి అధికారికంగా ఫిర్యాదు చేశారు. అంబటిపై వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా గోరంట్లలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద, తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ అయిందంటూ 'మహాపాపం' పేరుతో టీడీపీ నేతలు ఇటీవల ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీని వెంటనే తొలగించాలని, లేదంటే తామే తొలగిస్తామని అంబటి రాంబాబు హెచ్చరించారు. చెప్పినట్టుగానే శనివారం ఉదయం గోరంట్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి, ఆ తర్వాత ఫ్లెక్సీ వద్దకు వెళ్లేందుకు ఆయన సిద్ధమయ్యారు.
ఈ విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు భారీగా ఫ్లెక్సీ వద్దకు చేరుకున్నాయి. ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, ఫ్లెక్సీ వద్దకు రావద్దని అంబటికి సూచించారు. అయితే, ఆలయం నుంచి తిరుగు ప్రయాణమైన అంబటిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన కారు దిగేందుకు ప్రయత్నించగా పోలీసులు నివారించారు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన అంబటి రాంబాబు.. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి అత్యంత దారుణమైన భాషలో దూషించారు.
పరిస్థితి చేయిదాటిపోతుండటంతో పోలీసులు అంబటిని అక్కడి నుంచి పంపించివేశారు. ఈ ఘటన అనంతరం గుంటూరులోని ఆయన నివాసం వద్ద కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అంబటి వ్యాఖ్యలను 'అత్యంత దుర్మార్గం' అని మంత్రి కొల్లు రవీంద్ర, పార్థసారథి వంటి వారు తీవ్రంగా ఖండించారు. ఒక మాజీ మంత్రి అయి ఉండి, ముఖ్యమంత్రిపై ఇంతటి అనుచిత భాషను ఉపయోగించడం ఏమిటని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా గోరంట్లలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద, తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ అయిందంటూ 'మహాపాపం' పేరుతో టీడీపీ నేతలు ఇటీవల ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీని వెంటనే తొలగించాలని, లేదంటే తామే తొలగిస్తామని అంబటి రాంబాబు హెచ్చరించారు. చెప్పినట్టుగానే శనివారం ఉదయం గోరంట్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి, ఆ తర్వాత ఫ్లెక్సీ వద్దకు వెళ్లేందుకు ఆయన సిద్ధమయ్యారు.
ఈ విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు భారీగా ఫ్లెక్సీ వద్దకు చేరుకున్నాయి. ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, ఫ్లెక్సీ వద్దకు రావద్దని అంబటికి సూచించారు. అయితే, ఆలయం నుంచి తిరుగు ప్రయాణమైన అంబటిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన కారు దిగేందుకు ప్రయత్నించగా పోలీసులు నివారించారు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన అంబటి రాంబాబు.. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి అత్యంత దారుణమైన భాషలో దూషించారు.
పరిస్థితి చేయిదాటిపోతుండటంతో పోలీసులు అంబటిని అక్కడి నుంచి పంపించివేశారు. ఈ ఘటన అనంతరం గుంటూరులోని ఆయన నివాసం వద్ద కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అంబటి వ్యాఖ్యలను 'అత్యంత దుర్మార్గం' అని మంత్రి కొల్లు రవీంద్ర, పార్థసారథి వంటి వారు తీవ్రంగా ఖండించారు. ఒక మాజీ మంత్రి అయి ఉండి, ముఖ్యమంత్రిపై ఇంతటి అనుచిత భాషను ఉపయోగించడం ఏమిటని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.