అజిత్ పవార్ మరణం.. పైలట్ల నుంచి అలాంటి కాల్ రాలేదు: డీజీసీఏ కీలక విషయం వెల్లడి
- బారామతి విమాన ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు మరో నలుగురు మృతి
- రన్ వేను గుర్తించడంలో పైలట్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్న డీజీసీఏ
- ఆపదలో ఉన్నామని తెలియజేసే మేడే కాల్స్ రాలేదన్న డీజీసీఏ
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం కూలిపోయిన ఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) స్పందించింది. ల్యాండింగ్ సమయంలో రన్ వేను గుర్తించడంలో పైలట్లకు ఇబ్బందులు ఎదురైనట్లు పేర్కొంది. మొదటిసారి రన్ వేపై విమానం ల్యాండింగ్కు పైలట్ ప్రయత్నించారని, కానీ సరిగ్గా కనిపించకపోవడంతో గాల్లోనే చక్కర్లు కొట్టినట్లు వెల్లడించారు.
రెండోసారి ల్యాండింగ్కు ప్రయత్నించే ముందు గో అరౌండ్ పాటించినట్లు సమాచారం ఉందని, ఈ సమయంలో పైలట్ల నుంచి ఆపదలో ఉన్నామని తెలియజేసే ఎలాంటి మేడే కాల్స్ రాలేదని డీజీసీఏ కీలక విషయం వెల్లడించింది. బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు మరో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.
రెండోసారి ల్యాండింగ్కు ప్రయత్నించే ముందు గో అరౌండ్ పాటించినట్లు సమాచారం ఉందని, ఈ సమయంలో పైలట్ల నుంచి ఆపదలో ఉన్నామని తెలియజేసే ఎలాంటి మేడే కాల్స్ రాలేదని డీజీసీఏ కీలక విషయం వెల్లడించింది. బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు మరో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.