దావోస్ సదస్సు వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రతిపాదన
- ప్రపంచ ఆర్థిక సదస్సు ఫాలోఆప్ సదస్సును తెలంగాణలో నిర్వహించాలన్న ముఖ్యమంత్రి
- ప్రతి సంవత్సరం జులైలో హైదరాబాద్లో ఫాలోఅప్ సదస్సు నిర్వహించాలన్న సీఎం
- మద్దతు తెలిపిన ప్రముఖ వ్యాపారవేత్తలు, పాలసీ నిర్ణేతలు
ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బ్లెజ్ కో ఫౌండర్ సీఈవో దినకర్ మునగాల సమావేశమయ్యారు. హైదరాబాద్ లో బ్లెజ్ ఆర్ అండ్ డీ సెంటర్ విస్తరణకు తెలంగాణ ప్రభుత్వంతో ఆయన ఎంవోయూ కుదుర్చుకున్నారు. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.