ప్రమాణ స్వీకారం.. 20 మంది తిరువనంతపురం బీజేపీ కౌన్సిలర్లకు హైకోర్టు నోటీసులు

Thiruvananthapuram BJP Councillors High Court Issues Notices
  • ప్రమాణ స్వీకారం సమయంలో బీజేపీ కౌన్సిలర్లు నిబంధనలు ఉల్లంఘించారంటూ పిటిషన్
  • హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సీపీఐ-ఎం కౌన్సిలర్ దీపక్
  • బీజేపీ కౌన్సిలర్లకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు
తిరువనంతపురం కార్పొరేషన్‌కు చెందిన 20 మంది బీజేపీ కౌన్సిలర్లకు కేరళ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మున్సిపల్ నిబంధనల ప్రకారం దేవుడి పేరు మీద కాకుండా, బహుళ దేవతల పేర్లతో ప్రమాణ స్వీకారం చేసినందుకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. గత సంవత్సరం డిసెంబర్‌లో తిరువనంతపురం కార్పొరేషన్‌ను గెలుచుకోవడం ద్వారా రాష్ట్రంలో బీజేపీ ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించింది.

బీజేపీ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం కేరళ మునిసిపాలిటీ చట్టం నిర్దేశించిన ప్రమాణాలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ సీపీఐ-ఎం నాయకుడు, కౌన్సిలర్ ఎస్‌.పి. దీపక్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌‍ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం వారికి నోటీసులు జారీ చేసింది.

కేసు తుది తీర్పు వచ్చే వరకు బీజేపీ కౌన్సిలర్లను కౌన్సిల్ సమావేశాల్లోకి అనుమతించవద్దని, గౌరవ వేతనం అందుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ కోరగా, అందుకు హైకోర్టు నిరాకరించింది. పిటిషన్‌లో పేర్కొన్న కౌన్సిలర్లు జి.ఎస్. ఆశానాథ్, చెంబళత్తి ఉదయన్, ఆర్. సుగతన్ తదితరులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
Go Back to Shorts
Thiruvananthapuram BJP Councillors
Kerala High Court
Thiruvananthapuram Corporation
BJP Councillors Oath

More Telugu News