రాహుల్ గాంధీ పర్యటన అనంతరం.. డి.కె. శివకుమార్ ఆసక్తికర పోస్టు
- మంగళవారం నాడు మైసూరులో పర్యటించిన రాహుల్ గాంధీ
- రాహుల్ గాంధీ పర్యటన వేళ మరోసారి చర్చనీయాంశంగా మారిన సీఎం మార్పు అంశం
- ప్రార్థనలు ఎన్నటికీ విఫలం కావంటూ శివకుమార్ పోస్టు
రాహుల్ గాంధీ మంగళవారం మైసూరులో పర్యటించిన విషయం విదితమే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ తదితర ముఖ్య నేతలతో ఆయన కొంతసేపు సమావేశమయ్యారు. రాష్ట్రంలో అధికార పంపిణీ వ్యవహారంపై వారి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. అధికార మార్పిడి అంశంపై స్పష్టతనివ్వాలని సిద్ధరామయ్య కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శివకుమార్ చేసిన ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది.