కేంద్రమంత్రి నివాసంలో అగ్నిప్రమాదం
- ఢిల్లీలో మంత్రి రవిశంకర్ ప్రసాద్ అధికార నివాసంలో ఘటన
- ఉదయం 8 గంటల సమయంలో ప్రమాదం
- వెంటనే స్పందించి మంటలు ఆర్పిన అగ్నిమాపక శాఖ సిబ్బంది
అగ్నిప్రమాదం జరిగిన సమయంలో మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇంట్లోనే ఉన్నారా లేదా అనేది తెలియరాలేదు. మంత్రి నివాసంలోని ఒక గదిలో మంటలు ఎగిసిపడ్డాయని ఫోన్ రావడంతో మూడు ఫైరింజన్లతో వెళ్లి మంటలు ఆర్పామని అగ్నిమాపక శాఖ సిబ్బంది తెలిపారు. ఈ అగ్ని ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని వారు పేర్కొన్నారు.