శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో భారీ చోరీ
- ఆలయం వెనుక ద్వారం గుండా చొరబడ్డ దొంగలు
- రూ.60 లక్షల విలువైన ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు ధర్మకర్త వెల్లడి
- ఏకాదశి నాడు జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత మూతపడ్డ ఆలయం
ఏకాదశి నుంచి మూతపడ్డ ఆలయం
ఏకాదశి సందర్భంగా గతేడాది నవంబర్ 1న ఈ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఊహించని రీతిలో భక్తులు రావడంతో విపరీతమైన రద్దీ ఏర్పడింది. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరగగా.. తొమ్మిది మంది భక్తులు మరణించారు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసుల ఆదేశాల మేరకు దేవాలయంలో దర్శనాలు నిలిపివేశారు. అప్పటి నుంచి ఆలయం మూతపడి ఉంది.