Arunava Sen: బీజేపీ నేతలను సజీవ సమాధి చేస్తాం: టీఎంసీ ఎమ్మెల్యే అరుణవ సేన్ వివాదాస్పద వ్యాఖ్యలు

Arunava Sen TMC MLA Threatens to Bury BJP Leaders Alive
  • అసెంబ్లీ ఎన్నికల వేళ ‘బగ్నన్’ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యల వీడియో వైరల్
  • “రెండు నెలలు దీదీ మాట వినను.. వారిని కొట్టి పాతిపెడతాం” అంటూ హెచ్చరిక
  • ‘రాష్ట్ర ప్రేరేపిత హింస’కు ఇదే నిదర్శనమని మండిపడుతున్న బీజేపీ
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో హింసను ప్రేరేపించేలా అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎమ్మెల్యే అరుణవ సేన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. హౌరా జిల్లా బగ్నన్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన అరుణవ సేన్ బహిరంగ సభలో బీజేపీ నేతలను ఉద్దేశించి చేసిన హెచ్చరికల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఎమ్మెల్యే మాట్లాడుతూ "రెండు నెలల పాటు నేను దీదీ (మమతా బెనర్జీ) మాట వినను. దీదీ నన్ను క్షమించాలి. 2026లో బీజేపీ నేతలను కొట్టి, బతికుండగానే సమాధి చేస్తాం" అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ జాతీయ ప్రతినిధి ప్రదీప్ భండారీ సహా పలువురు నేతలు తీవ్రంగా ఖండించారు. టీఎంసీ ప్రభుత్వం రాష్ట్రంలో గూండారాజ్‌ను ప్రోత్సహిస్తోందని, ఓటమి భయంతోనే ఇలాంటి బెదిరింపులకు దిగుతున్నారని వారు విమర్శించారు.

అరుణవ సేన్ 2021 నుంచి బగ్నన్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్న ఆయనపై పోలీసులు, ఎన్నికల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వివాదంపై అటు టీఎంసీ నాయకత్వం గానీ, ఎమ్మెల్యే అరుణవ సేన్ గానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఎన్నికలకు ముందు ఇరు పార్టీల మధ్య పెరుగుతున్న ఈ మాటల యుద్ధం రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఆందోళన కలిగిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Arunava Sen
Arunava Sen TMC
TMC MLA
West Bengal Politics
BJP Leaders
Mamata Banerjee
2026 Elections
Baghnan
Pradeep Bhandari
Political Violence

More Telugu News