జార్ఖండ్లో దారుణం: పశువుల దొంగతనం నెపంతో వ్యక్తిపై మూకదాడి.. హత్య!
- బీహార్ పశువుల సంత నుంచి వస్తుండగా అమానుష దాడి
- బాధితుడిని వివస్త్రను చేసిన నిందితులు
- ముస్లిం అని నిర్ధారించుకున్నాక గొడ్డలి, బాణాలతో దాడిచేశారన్న కుటుంబ సభ్యులు
- ఇది మతపరమైన ద్వేషంతో జరిగిన హత్యేనని ఆరోపణ
పోలీసు రికార్డుల ప్రకారం మృతుడిపై గతంలో కొన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయని డీఎస్పీ జేపీఎన్ చౌదరి తెలిపారు. అయితే, తన సోదరుడి వద్ద పశువుల రవాణాకు సంబంధించిన అన్ని చట్టబద్ధమైన పత్రాలు ఉన్నాయని, దొంగతనానికి అతడికి ఎలాంటి సంబంధం లేదని పప్పు బావ ఫుర్కాన్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై జార్ఖండ్ మంత్రి ఇర్ఫాన్ అన్సారీ స్పందిస్తూ.. "ఇలాంటి విద్వేష బీజాలు ఎవరు నాటుతున్నారు?" అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈ ఘటనపై తక్షణ విచారణకు ఆదేశించారని, నిందితులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని మంత్రి హామీ ఇచ్చారు. మృతుడికి భార్య, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.