ఎయిర్ టెల్ నుంచి సరికొత్త చవక ప్లాన్

  • ఏడాదిపాటు చెల్లుబాటు అయ్యే అపరిమిత కాలింగ్ ప్లాన్
  • ప్లాన్ ధర రూ. 1,849
  • ఇంటర్నెట్ అవసరం లేని వారికి ఉపయోగపడే ప్లాన్

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు ఊరటనిచ్చేలా మరో ఆకర్షణీయమైన ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తరచూ రీఛార్జ్ చేయాల్సిన తలనొప్పికి చెక్ పెట్టేలా, తక్కువ బడ్జెట్‌లోనే దీర్ఘకాలిక ప్లాన్‌లపై ఎయిర్‌టెల్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే ఏడాది పొడవునా చెల్లుబాటు అయ్యే, అపరిమిత కాలింగ్ సౌకర్యంతో కూడిన కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.


ఎయిర్‌టెల్ తాజాగా తన రీఛార్జ్ ప్లాన్ పోర్ట్‌ఫోలియోను పూర్తిగా అప్‌గ్రేడ్ చేసింది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ వ్యాలిడిటీ కలిగిన ప్లాన్‌లను అందిస్తూ, తరచూ రీఛార్జ్ చేసుకునే ఇబ్బందిని తగ్గిస్తోంది. తక్కువ ధరలో ఏడాది పాటు కాలింగ్ అవసరాలను తీర్చే ప్లాన్ కావాలనుకునే వారికి ఇప్పుడు సరైన ఆప్షన్ లభించింది. ఎయిర్‌టెల్ అందిస్తున్న ఈ ప్రత్యేక ప్లాన్ ధర కేవలం రూ. 1,849 మాత్రమే. ఈ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ నిజంగానే 365 రోజుల పూర్తి వ్యాలిడిటీని అందిస్తుంది. రీఛార్జ్‌పై అధికంగా ఖర్చు చేయకూడదనుకునే వినియోగదారులకు ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.


ఈ ప్లాన్‌లో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే, ఏడాది పొడవునా అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాలింగ్ సదుపాయం లభిస్తుంది. అయితే ఇది పూర్తిగా వాయిస్-ఓన్లీ ప్లాన్ కావడంతో ఇందులో మొబైల్ డేటా సౌకర్యం ఉండదని వినియోగదారులు గమనించాలి. ఇంటర్నెట్ అవసరం తక్కువగా ఉండి, కాలింగ్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే వారికి ఈ ప్లాన్ చాలా ఉపయోగకరంగా మారనుంది.



More Telugu News