ఒడిశాలో కూలిపోయిన చార్టర్డ్ విమానం

  • రూర్కేలా నుండి భువనేశ్వర్‌కు వెళుతున్న చార్టర్డ్ విమానం
  • పైలట్ సహా ఏడుగురు ప్రయాణికులు ఉండగా కూలిన చార్టర్డ్
  • క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు
ఒడిశాలో చార్టర్డ్ విమానం కూలిపోయింది. రూర్కేలా నుంచి భువనేశ్వర్‌కు ప్రయాణిస్తున్న తొమ్మిది సీట్ల విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికి ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటన జరిగిన సమయంలో విమానంలో పైలట్‌తో సహా మొత్తం ఏడుగురు వ్యక్తులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులకూ గాయాలు కాగా, వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సుందర్‌గఢ్ జిల్లాలోని కన్సార్ ప్రాంతంలో ఈ చార్టర్డ్ విమానం కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా నిర్ధారణ కాలేదు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 


More Telugu News