Chandrababu Naidu: టేస్ట్ చాలా బాగుంది... హల్వా రుచి చూసిన చంద్రబాబు

Chandrababu Naidu Tastes Halwa at Sarass Exhibition
  • గుంటూరు శివార్లలో సరస్ - డ్వాక్రా బజార్ ను సందర్శించిన చంద్రబాబు
  • ఒక స్టాల్లో మాడుగుల హల్వాను రుచి చూసిన సీఎం
  • ఇతర స్టాళ్లలోని ఉత్పత్తులను పరిశీలించిన వైనం

గుంటూరు నగర శివార్లలో నిర్వహిస్తున్న 'సరస్ ఎగ్జిబిషన్ - అఖిల భారత డ్వాక్రా బజార్' ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. ఈరోజు అక్కడకు వెళ్లిన ముఖ్యమంత్రి ప్రదర్శనలో భాగంగా డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను స్వయంగా పరిశీలించారు. 


ఈ సందర్భంగా ఒక స్టాల్లో ఏర్పాటు చేసిన మాడుగుల హల్వాను చంద్రబాబు రుచి చూశారు. టేస్ట్ చాలా బాగుందని ప్రశంసించారు. దీంతో, ఆ స్టాల్ ను ఏర్పాటు చేసిన మహిళలు ఉప్పొంగిపోయారు. అనంతరం ఇతర స్టాళ్లలోని ఉత్పత్తులను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెంట కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మాధవి, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తదితరులు ఉన్నారు.

Chandrababu Naidu
AP CM
Andhra Pradesh
Sarass Exhibition
Dwakra Bazaar
Guntur
Madugula Halwa
Pemmmasani Chandrasekhar
Kondapalli Srinivas

More Telugu News