Chandrababu Naidu: కృష్ణా జలాలపై త్వరలో అన్ని విషయాలు మాట్లాడతా: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu to Address Krishna River Water Dispute Soon
  • రాయలసీమ లిఫ్ట్ పనులను ఆపింది తానేనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య
  • రేవంత్ వ్యాఖ్యలతో  చెలరేగిన దుమారం
  • కృష్ణా జలాలపై త్వరలోనే వాస్తవాలు వివరిస్తానన్న సీఎం చంద్రబాబు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృష్ణా నదీ జలాల వివాదంపై చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేపాయి. తన విజ్ఞప్తి మేరకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పథకం (ఆర్ఎల్ఐఎస్) పనులను నిలిపివేశారని రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో ప్రకటించడం ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. "నా మీద ఉన్న గౌరవంతో చంద్రబాబు ఆ పనులు ఆపేశారు" అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ నేపథ్యంలో, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వివాదంపై స్పందించారు. కృష్ణా జలాల విషయంలో అసలు ఏం జరిగిందో త్వరలోనే మీడియా ద్వారా అన్ని వాస్తవాలు వివరిస్తానని ఆయన తెలిపారు. చంద్రబాబు వివరణ తర్వాత ఈ వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
Chandrababu Naidu
Krishna River Water Dispute
Revanth Reddy
Rayalaseema Lift Irrigation Scheme
RLIS Project
Andhra Pradesh
Telangana
Water Resources
River Water Sharing

More Telugu News