Nidhi Agarwal: ఇది ఏఐ కాదు... ప్రభాస్ తో ఫొటో పంచుకున్న నిధి
- సంక్రాంతి కానుకగా జనవరి 9న రాబోతున్న ప్రభాస్ 'రాజాసాబ్'
- విడుదలకు ఒకరోజు ముందే జనవరి 8న పెయిడ్ ప్రీమియర్లు
- ఆసక్తికర ఫొటో పంచుకున్న నిధి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కొత్త చిత్రం 'ది రాజాసాబ్' సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. హారర్ కామెడీ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజాసాబ్ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో హీరోయిన్ నిధి అగర్వాల్ తన సోషల్ మీడియా ఖాతాలో ఆసక్తికర ఫొటో పంచుకుంది. అందులో ఆమె ప్రభాస్ తో కలిసి చిరునవ్వులు చిందిస్తోంది. "ఇది ఏఐ ఫొటో కాదు" అంటూ అమ్మడు క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఈ పిక్ ను ప్రభాస్ ఫ్యాన్ప్ విశేషంగా లైక్ చేస్తున్నారు.
ఈ సినిమా విషయానికొస్తే... ఈ చిత్రం మరో ఐదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకువస్తోంది. ఓవర్సీస్లో, ముఖ్యంగా నార్త్ అమెరికా మార్కెట్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ చిత్రం 450,000 డాలర్లు (సుమారు రూ. 3.75 కోట్లు) మార్కును దాటినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఈ సినిమా విడుదలకు ఒకరోజు ముందే, అంటే జనవరి 8న భారత్, నార్త్ అమెరికాలో పెయిడ్ ప్రీమియర్ షోలను ప్రదర్శించనున్నారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి తన పూర్వీకుల ఆస్తిని అమ్మాలనుకున్న కథానాయకుడికి అక్కడ ఎదురైన అనుభవాలే ఈ సినిమా కథాంశం. ఈ చిత్రంలో ప్రభాస్కు తాత ఆత్మ రూపంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మొదట ఈ సినిమా రన్టైమ్ 3 గంటల 9 నిమిషాలుగా వార్తలు రాగా, తాజాగా కొన్ని సన్నివేశాలను తొలగించి నిడివిని సుమారు 2 గంటల 55 నిమిషాలకు కుదించినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ మేకోవర్, నటన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుందని దర్శకుడు మారుతి ధీమా వ్యక్తం చేశారు. జనవరి 7 నుంచి నైజాం ఏరియాలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.
ఈ సినిమా విషయానికొస్తే... ఈ చిత్రం మరో ఐదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకువస్తోంది. ఓవర్సీస్లో, ముఖ్యంగా నార్త్ అమెరికా మార్కెట్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ చిత్రం 450,000 డాలర్లు (సుమారు రూ. 3.75 కోట్లు) మార్కును దాటినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఈ సినిమా విడుదలకు ఒకరోజు ముందే, అంటే జనవరి 8న భారత్, నార్త్ అమెరికాలో పెయిడ్ ప్రీమియర్ షోలను ప్రదర్శించనున్నారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి తన పూర్వీకుల ఆస్తిని అమ్మాలనుకున్న కథానాయకుడికి అక్కడ ఎదురైన అనుభవాలే ఈ సినిమా కథాంశం. ఈ చిత్రంలో ప్రభాస్కు తాత ఆత్మ రూపంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మొదట ఈ సినిమా రన్టైమ్ 3 గంటల 9 నిమిషాలుగా వార్తలు రాగా, తాజాగా కొన్ని సన్నివేశాలను తొలగించి నిడివిని సుమారు 2 గంటల 55 నిమిషాలకు కుదించినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ మేకోవర్, నటన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుందని దర్శకుడు మారుతి ధీమా వ్యక్తం చేశారు. జనవరి 7 నుంచి నైజాం ఏరియాలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.