Tirumala: తిరుమలలో మూడ్రోజుల్లో 1.77 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం

177 Lakh Pilgrims Get Vaikunta Dwaram Darshan in Three Days in Tirumala
షార్ట్స్‌లో చూడండి
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు పరిపూర్ణ ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతున్నాయి. తొలి మూడు రోజుల్లో (డిసెంబర్ 30, 31, జనవరి 1) మొత్తం 1,77,337 మంది భక్తులు వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు. ఈ దర్శనాలు జనవరి 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి.

డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ప్రారంభమైన ఈ దర్శనాల్లో, మొదటి మూడు రోజులు ఈ-డిప్ రిజిస్ట్రేషన్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులను మాత్రమే అనుమతించారు. శిలాతోరణం, కృష్ణతేజ, ఏటీజీహెచ్ ప్రవేశ మార్గాల వద్ద టోకెన్లను స్కాన్ చేసి భక్తులను దర్శన క్యూలైన్లలోకి పంపించారు. గురువారం నాడు సాయంత్రం 5 గంటల సమయానికి 40,008 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ-డిప్ టోకెన్లు పొందిన భక్తుల దర్శనాలు పూర్తయిన తర్వాత, టోకెన్లు లేని సాధారణ భక్తులను (సర్వదర్శనం) వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్నారు. వీరిని అక్టోపస్ భవనం వద్ద నుంచి సర్వదర్శనం క్యూలైన్‌లోకి పంపిస్తారు. టీటీడీ చేసిన ఏర్పాట్లతో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతంగా దర్శనం చేసుకుంటున్నారు.
Go Back to Shorts
Tirumala
Tirumala Tirupati Devasthanam
TTD
Vaikunta Ekadasi
Vaikunta Dwaram
Lord Venkateswara
e-Dip registration
Sarvadarshanam
Tirupati
Andhra Pradesh

More Telugu News