Tirumala Laddoo: 2025లో పెరిగిన తిరుమల శ్రీవారి లడ్డూల అమ్మకం... డిసెంబరు 27న రికార్డు స్థాయిలో విక్రయాలు

Tirumala Laddoo Sales Increased in 2025 Record Sales on December 27th
  • 2025లో రికార్డు స్థాయిలో శ్రీవారి లడ్డూల విక్రయాలు
  • మొత్తం 13.52 కోట్ల లడ్డూలను విక్రయించిన టీటీడీ
  • 2024తో పోలిస్తే 1.37 కోట్ల లడ్డూలు అదనం
  • భక్తుల రద్దీ, నాణ్యతపై నమ్మకమే అమ్మకాలు పెరగడానికి కారణం
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాల్లో 2025వ సంవత్సరం సరికొత్త రికార్డును నెలకొల్పింది. 2025లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మొత్తం 13.52 కోట్ల లడ్డూలను భక్తులకు విక్రయించింది. 2024లో విక్రయించిన 12.15 కోట్ల లడ్డూలతో పోలిస్తే ఇది సుమారు 1.37 కోట్లు అధికం కావడం విశేషం.

2025లో లడ్డూల అమ్మకాల్లో దాదాపు పది శాతం వృద్ధి నమోదైంది. అంతేకాకుండా, డిసెంబర్ 27వ తేదీన ఒక్కరోజే ఏకంగా 5.13 లక్షల లడ్డూలు విక్రయించి టీటీడీ మరో రికార్డు సృష్టించింది. ఏడాది పొడవునా భక్తుల రద్దీ గణనీయంగా పెరగడం, ముఖ్యంగా వైకుంఠ ద్వార దర్శనం వంటి ప్రత్యేక పర్వదినాలు, బ్రహ్మోత్సవాలు, సెలవు రోజుల్లో భక్తులు భారీగా తరలిరావడమే ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

లడ్డూ ప్రసాదం నాణ్యత, రుచిపై భక్తుల్లో ఉన్న అచంచల విశ్వాసం, పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా టీటీడీ ఉత్పత్తి సామర్థ్యాన్ని రోజుకు 3.5 లక్షల నుంచి 4 లక్షలకు పెంచడం వంటి చర్యలు కూడా అమ్మకాలు పెరగడానికి దోహదపడ్డాయి. గతేడాది జులై నెలలో ఏకంగా రూ.62.2 కోట్ల విలువైన లడ్డూలు అమ్ముడవడం కూడా ఈ ఏడాది రికార్డులో కీలక పాత్ర పోషించింది. 
Tirumala Laddoo
TTD
Tirumala Tirupati Devasthanams
Laddoo Sales
Tirupati Temple
Srivari Laddu
Record Sales
Va વૈకుଣ୍ઠ एकादशी
Brahmotsavam
Andhra Pradesh Temples

More Telugu News