Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఇద్దరు మృతి

Andhra Pradesh Road Accident Two Killed in Vizianagaram
  • విజయనగరం జిల్లా గణపతినగరం రైల్వే స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిపై ఘటన 
  • ఒడిశా నుంచి విశాఖపట్నం వైపుకు వెళ్తుండగా ప్రమాదం 
  • అదుపుతప్పి చెట్టుకు ఢీకొన్న వ్యాన్
  • మృతులు విశాఖకు చెందిన విజయకుమార్, దిశేష్‌లుగా గుర్తింపు
ఓ మినీ వ్యాన్ అదుపుతప్పి చెట్టుకు ఢీకొన్న ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ ఘటన విజయనగరం జిల్లా గణపతినగరంలో రైల్వే స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది. 

ఒడిశాలోని రాయగడ నుంచి విశాఖపట్నం వైపు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతులను విశాఖకు చెందిన పొట్నూరు విజయకుమార్, దినేష్ లుగా గుర్తించారు. 

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Road Accident
Andhra Pradesh road accident
Vizianagaram accident
Ganapathinagaram
Mini van accident
Potnuru Vijay Kumar
Dinesh
Visakhapatnam
Odisha
Rayagada

More Telugu News