PM Modi: ప్ర‌ధాని మోదీ సభలో 'సమోసా'ల కోసం కొట్లాట.. నెట్టింట‌ వీడియో వైరల్!

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 101వ జయంతి సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఏర్పాటు చేసిన కార్యక్రమం అనూహ్య ఘటనకు వేదికైంది. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగిస్తున్న సమయంలోనే సభకు హాజరైన కొందరి మధ్య సమోసాల కోసం తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

లక్నోలో వాజ్‌పేయి స్మారక చిహ్నాన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ బహిరంగ సభలో ప్రసంగించారు. అదే సమయంలో సభ ప్రాంగణంలో సమోసాల పంపిణీ విషయంలో వివాదం చెలరేగింది. సమోసాలు కొందరికి అందకపోవడంతో మాటామాటా పెరిగి అది కాస్తా కొట్లాటకు దారితీసింది.

సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వీడియో ప్రకారం ముగ్గురు వ్యక్తులు కలిసి ఒకరిపై పిడిగుద్దులు, తన్నులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో బాధితుడు కుర్చీల వరుసలపై పడిపోయాడు. ప్రధాని ప్రసంగం నేపథ్యంగా వినిపిస్తుండగానే ఈ ఘర్షణ జరగడం గమనార్హం.

ఈ ఘటనపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. "రాజకీయాల కన్నా సమోసాలే ముఖ్యం" అంటూ కొందరు కామెంట్ చేయగా, మరికొందరు "వన్ నేషన్, వన్ సమోసా" అనే హ్యాష్‌ట్యాగ్‌తో సెటైర్లు వేస్తున్నారు. 
PM Modi
Atal Bihari Vajpayee
Lucknow
Samosa
Uttar Pradesh
Samosa Fight
Viral Video
Political Event
Prime Minister Modi
BJP

More Telugu News