YS Jagan Mohan Reddy: నేడు పులివెందులకు జగన్ ..మూడు రోజులు అక్కడే
- ఈ రోజు సాయంత్రం 4 గంటలకు పులివెందులకు చేరుకోనున్న జగన్
- ఈ రోజు, రేపు క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్
- 25న క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్న జగన్
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేటి నుండి మూడు రోజుల పాటు తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించనున్నారు. ఈ రోజు సాయంత్రం బెంగళూరు నుండి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి సాయంత్రం 4 గంటలకు పులివెందుల చేరుకుంటారు. అనంతరం, అక్కడ వైసీపీ క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు.
రేపు (బుధవారం) ఉదయం 10:30 గంటలకు పులివెందుల నుండి ఇడుపులపాయకు చేరుకుని ప్రార్థనా మందిరంలో జరిగే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి పులివెందులకు చేరుకుని భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో జగన్ ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. స్థానికుల నుంచి సమస్యలు తెలుసుకుని వినతులు స్వీకరిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు.
గురువారం ఉదయం 8:30 గంటలకు క్రిస్మస్ సందర్భంగా సీఎస్ఐ చర్చిలో జరిగే వేడుకల్లో పాల్గొననున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 10:20 గంటలకు పులివెందుల భాకరాపురంలోని హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. ఉదయం 10:30 గంటలకు హెలీకాఫ్టర్ లో బెంగళూరుకు బయలుదేరి వెళ్తారు.
రేపు (బుధవారం) ఉదయం 10:30 గంటలకు పులివెందుల నుండి ఇడుపులపాయకు చేరుకుని ప్రార్థనా మందిరంలో జరిగే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి పులివెందులకు చేరుకుని భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో జగన్ ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. స్థానికుల నుంచి సమస్యలు తెలుసుకుని వినతులు స్వీకరిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు.
గురువారం ఉదయం 8:30 గంటలకు క్రిస్మస్ సందర్భంగా సీఎస్ఐ చర్చిలో జరిగే వేడుకల్లో పాల్గొననున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 10:20 గంటలకు పులివెందుల భాకరాపురంలోని హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. ఉదయం 10:30 గంటలకు హెలీకాఫ్టర్ లో బెంగళూరుకు బయలుదేరి వెళ్తారు.