Vijay Deverakonda: 'రౌడీ జనార్ధన్' సినిమాలో విజయ్ దేవరకొండ మొదటిసారి గోదావరి యాసలో మాట్లాడతాడు: దిల్ రాజు
- 'రౌడీ జనార్ధన్' గ్లింప్స్ లాంచ్
- విజయ్ తన కెరీర్లో ఇప్పటి వరకు పోషించని పాత్రలో కనిపిస్తాడన్న దిల్ రాజు
- ప్రేక్షకులకు ఎలాంటి సినిమాలు నచ్చితే అలాగే తీయాలన్న నిర్మాత
యంగ్ హీరో విజయ్ దేవరకొండ మొట్టమొదటిసారిగా 'రౌడీ జనార్ధన్' చిత్రంలో గోదావరి యాసలో మాట్లాడతాడని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలిపారు. విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ, విజయ్ కెరీర్లో ఇంతవరకు పోషించని ఒక విభిన్నమైన పాత్రలో ఈ చిత్రంలో కనపడతాడని అన్నారు.
అంతేకాకుండా, ఇందులో విజయ్ పూర్తిస్థాయి మాస్ పాత్రను పోషిస్తున్నాడని పేర్కొన్నారు. ఇది 80వ దశకం నాటి కథాంశంతో రూపొందుతోందని తెలిపారు. 2026లో తమ నిర్మాణ సంస్థ నుంచి 6 సినిమాలు విడుదల కానున్నాయని వెల్లడించారు.
మీ బ్యానర్ నుంచి ఇంతకుముందు రక్తపాతంతో హింసాత్మక సినిమాలు రాలేదని విలేకరి అడిగిన ప్రశ్నకు దిల్ రాజు సమాధానమిస్తూ, ఈ మధ్యకాలంలో ప్రేక్షకులకు ఎలాంటి సినిమాలు నచ్చుతున్నాయో గమనిస్తున్నామని, వారి అభిరుచులకు అనుగుణంగానే సినిమాలు తీస్తామని అన్నారు. ఈ సినిమా అభిమానులకు డబుల్ మీల్స్ అయితే, ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ వంటి విందు భోజనం అని పేర్కొన్నారు.
అంతేకాకుండా, ఇందులో విజయ్ పూర్తిస్థాయి మాస్ పాత్రను పోషిస్తున్నాడని పేర్కొన్నారు. ఇది 80వ దశకం నాటి కథాంశంతో రూపొందుతోందని తెలిపారు. 2026లో తమ నిర్మాణ సంస్థ నుంచి 6 సినిమాలు విడుదల కానున్నాయని వెల్లడించారు.
మీ బ్యానర్ నుంచి ఇంతకుముందు రక్తపాతంతో హింసాత్మక సినిమాలు రాలేదని విలేకరి అడిగిన ప్రశ్నకు దిల్ రాజు సమాధానమిస్తూ, ఈ మధ్యకాలంలో ప్రేక్షకులకు ఎలాంటి సినిమాలు నచ్చుతున్నాయో గమనిస్తున్నామని, వారి అభిరుచులకు అనుగుణంగానే సినిమాలు తీస్తామని అన్నారు. ఈ సినిమా అభిమానులకు డబుల్ మీల్స్ అయితే, ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ వంటి విందు భోజనం అని పేర్కొన్నారు.