ఏపీ సర్కారు ఖాళీ చేసిన భవనాల్లోకి తెలంగాణ ప్రభుత్వ కార్యాలయాలు
- అద్దె భవనాల్లోని ప్రభుత్వ ఆఫీసులు ఈ నెలాఖరులోగా ఖాళీ చేయాలని సర్కులర్ జారీ
- ఏపీ ఆఫీసులన్నీ విజయవాడకు తరలివెళ్లడంతో ఖాళీగా ఉన్న భవనాలు
- ఫిబ్రవరి 1 నుంచి అద్దె చెల్లించవద్దంటూ ట్రెజరీకి ఆదేశాలు
ఈ నెలాఖరులోగా అద్దె భవనాలను ఖాళీ చేయాలని అందులో ఆదేశించింది. అదేవిధంగా ఫిబ్రవరి 1 నుంచి అద్దె చెల్లింపును నిలిపివేయాలని ట్రెజరీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పరిశ్రమ్ భవన్, గగన్ విహార్ కాంప్లెక్స్, బీఆర్కే భవన్, ఎర్రమ్ మంజిల్ వంటి భవనాలను పరిశీలించి తమ ఆఫీసులను తక్షణమే తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని అన్ని శాఖల ప్రత్యేక కార్యదర్శులు, సీఎస్ లు, డిపార్టుమెంట్ల ఉన్నతాధికారులను ఆర్థిక శాఖ ఆదేశించింది. జనవరి 1 నుంచి కచ్చితంగా ప్రభుత్వ భవనాల్లోనే ఆఫీసులు కొనసాగాలని స్పష్టం చేసింది.