బంగ్లాదేశ్‌లో దాడులను ఖండించరేం?: విజయసాయిరెడ్డి

  • హిందువులపై హింసను నరమేధంగా అభివర్ణించిన విజయసాయి
  • దాడులను ఖండించని వారు భారతీయులేనా? అని ప్రశ్న
  • స్పందించని వారిని దేశం నుంచి బహిష్కరించాలని పిలుపు
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల పట్ల దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ హింసను 'నరమేధం'గా అభివర్ణించిన ఆయన, ఈ దాడులను ఖండించని వారు అసలు భారతీయులేనా? అంటూ సంచలన ప్రశ్నలు సంధించారు.

ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, మతం పేరుతో సాగుతున్న ఈ హింస మానవత్వానికే మాయని మచ్చ అని ఆవేదన వ్యక్తం చేశారు. "బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అమానుష దాడులను ఖండించకుండా మౌనంగా ఉన్న రాజకీయ పార్టీలకు, నాయకులకు ఈ దేశంలో కొనసాగే నైతిక హక్కు ఉందా?" అని నిలదీశారు. భారతదేశం సహనానికి, మత సామరస్యానికి ప్రతీక అని, అలాంటి దేశంలో ఉంటూ ఈ దాడులపై స్పందించకపోవడం దేశభక్తికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు.

ఇది కేవలం ఒక దేశ సమస్య కాదని, అంతర్జాతీయ మానవ హక్కుల ఉల్లంఘన అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. బాధితుల పక్షాన నిలబడకుండా మౌనం పాటించడం అనైతికమని, ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగించడమేనని అన్నారు. ఈ దాడులను ఖండించలేని వారిని మనమే దేశం నుంచి బహిష్కరిద్దామని ఆయన పిలుపునిచ్చారు.

బంగ్లాదేశ్ హింసాకాండపై భారత ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తీసుకోవాలని, బాధితులకు అండగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు.  


More Telugu News

Vijayasai Reddy Bangladesh Hindu attacks Hindu violence Bangladesh Bangladesh riots Religious violence Human rights violation India Bangladesh relations Political criticism Social justice Communal harmony