Indian Air Force: భారత్ బాగానే దెబ్బతీసింది... భవనం మొత్తానికి టార్పాలిన్ కప్పుకున్న పాకిస్థాన్
- ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాక్ గడ్డపై ఐఏఎఫ్ భీకర దాడులు
- ఐఏఎఫ్ దాడి చేసిన మురిద్ ఎయిర్బేస్లో భారీ మరమ్మతులు
- శాటిలైట్ చిత్రాల్లో బయటపడిన పునర్నిర్మాణ పనులు
- భవనాన్ని కప్పివేస్తూ భారీ రెడ్ టార్పాలిన్ ఏర్పాటు
- మే 10న 'ఆపరేషన్ సిందూర్'లో ధ్వంసమైన కమాండ్ సెంటర్
- అంతర్గత నష్టం తీవ్రంగా జరిగినట్లు నిపుణుల అంచనా
'ఆపరేషన్ సిందూర్'లో భాగంగా భారత వాయుసేన (IAF) దాడి చేసిన పాకిస్థాన్లోని కీలకమైన ఎయిర్బేస్లో భారీగా పునర్నిర్మాణ పనులు జరుగుతున్నట్లు వెల్లడైంది. మురిద్ ఎయిర్బేస్లోని కీలక కమాండ్ అండ్ కంట్రోల్ భవనంపై జరిపిన దాడిలో దెబ్బతిన్న ప్రాంతాన్ని కప్పిపుచ్చేందుకు పాకిస్థాన్ ఇప్పుడు ఓ భారీ రెడ్ టార్పాలిన్ను ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని ఎన్డీటీవీకి లభించిన హై-రిజల్యూషన్ శాటిలైట్ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి.
డిసెంబర్ 16న తీసిన ఈ శాటిలైట్ చిత్రాల్లో... పాకిస్థాన్ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ (UAV) ఆపరేట్ చేసే కాంప్లెక్స్ పక్కనే ఉన్న ఈ భవనాన్ని పూర్తిగా ఎర్ర టార్పాలిన్తో కప్పేసినట్లు కనిపిస్తోంది. గతంలో జూన్లో తీసిన చిత్రాల్లో కేవలం దెబ్బతిన్న భాగాన్ని మాత్రమే చిన్న గ్రీన్ టార్పాలిన్తో కప్పారు. కానీ ఇప్పుడు మొత్తం భవనానికే టార్పాలిన్ ఏర్పాటు చేయడం గమనార్హం. సాధారణంగా సైనిక స్థావరాల్లో మరమ్మతు పనులను, నష్టాన్ని శాటిలైట్ నిఘా నుంచి దాచిపెట్టేందుకు ఇలాంటి భారీ టార్పాలిన్లను ఉపయోగిస్తారు.
ఈ ఏడాది మే 10వ తేదీన తెల్లవారుజామున భారత వైమానిక దళం జరిపిన దాడుల్లో ఈ భవనం పైకప్పు కూలిపోవడంతో పాటు, నిర్మాణానికి తీవ్ర నష్టం వాటిల్లింది. లోపల ఉన్న వ్యవస్థలు కూడా ధ్వంసమై ఉంటాయని అంచనా. పైకప్పును చీల్చుకుని లోపలికి వెళ్లి పేలే అత్యాధునిక క్షిపణులను (penetrator warheads) ఐఏఎఫ్ ఈ దాడిలో ఉపయోగించి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
శాటిలైట్ చిత్రాల నిపుణుడు డేమియన్ సైమన్ ప్రకారం, మొదట నష్టాన్ని అంచనా వేయడానికి చిన్న టార్పాలిన్ వాడి, ఇప్పుడు మొత్తం భవనాన్ని కప్పేయడం చూస్తుంటే అంతర్గత నష్టం ఊహించిన దానికంటే ఎక్కువగా జరిగి ఉండవచ్చని తెలుస్తోంది. మురిద్తో పాటు ముషాఫ్, రహీమ్ యార్ ఖాన్ వంటి ఇతర ఎయిర్బేస్లలో దెబ్బతిన్న రన్వేలకు కూడా పాకిస్థాన్ మరమ్మతులు పూర్తి చేసినట్లు సమాచారం.
డిసెంబర్ 16న తీసిన ఈ శాటిలైట్ చిత్రాల్లో... పాకిస్థాన్ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ (UAV) ఆపరేట్ చేసే కాంప్లెక్స్ పక్కనే ఉన్న ఈ భవనాన్ని పూర్తిగా ఎర్ర టార్పాలిన్తో కప్పేసినట్లు కనిపిస్తోంది. గతంలో జూన్లో తీసిన చిత్రాల్లో కేవలం దెబ్బతిన్న భాగాన్ని మాత్రమే చిన్న గ్రీన్ టార్పాలిన్తో కప్పారు. కానీ ఇప్పుడు మొత్తం భవనానికే టార్పాలిన్ ఏర్పాటు చేయడం గమనార్హం. సాధారణంగా సైనిక స్థావరాల్లో మరమ్మతు పనులను, నష్టాన్ని శాటిలైట్ నిఘా నుంచి దాచిపెట్టేందుకు ఇలాంటి భారీ టార్పాలిన్లను ఉపయోగిస్తారు.
ఈ ఏడాది మే 10వ తేదీన తెల్లవారుజామున భారత వైమానిక దళం జరిపిన దాడుల్లో ఈ భవనం పైకప్పు కూలిపోవడంతో పాటు, నిర్మాణానికి తీవ్ర నష్టం వాటిల్లింది. లోపల ఉన్న వ్యవస్థలు కూడా ధ్వంసమై ఉంటాయని అంచనా. పైకప్పును చీల్చుకుని లోపలికి వెళ్లి పేలే అత్యాధునిక క్షిపణులను (penetrator warheads) ఐఏఎఫ్ ఈ దాడిలో ఉపయోగించి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
శాటిలైట్ చిత్రాల నిపుణుడు డేమియన్ సైమన్ ప్రకారం, మొదట నష్టాన్ని అంచనా వేయడానికి చిన్న టార్పాలిన్ వాడి, ఇప్పుడు మొత్తం భవనాన్ని కప్పేయడం చూస్తుంటే అంతర్గత నష్టం ఊహించిన దానికంటే ఎక్కువగా జరిగి ఉండవచ్చని తెలుస్తోంది. మురిద్తో పాటు ముషాఫ్, రహీమ్ యార్ ఖాన్ వంటి ఇతర ఎయిర్బేస్లలో దెబ్బతిన్న రన్వేలకు కూడా పాకిస్థాన్ మరమ్మతులు పూర్తి చేసినట్లు సమాచారం.