ప్రధాని మోదీకి ఒమన్ అత్యున్నత పురస్కారం... 29వ అంతర్జాతీయ గౌరవం
- 'ది ఫస్ట్ క్లాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఒమన్'ను ప్రదానం చేసిన సుల్తాన్
- రెండు రోజుల క్రితం ఇథియోపియా నుంచి కూడా అత్యున్నత గౌరవం
- భారత్-ఒమన్ మధ్య కీలక సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం
- ఇరు దేశాల 70 ఏళ్ల దౌత్య సంబంధాలకు గుర్తుగా ఈ పర్యటన
అంతకుముందు, ప్రధాని మోదీ, ఒమన్ సుల్తాన్ హైథమ్ మధ్య మస్కట్లోని అల్ బరకా ప్యాలెస్లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇరు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) కుదరడాన్ని ఇరువురు నేతలు ఒక కీలక మైలురాయిగా అభివర్ణించారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత వంటి పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు.
భారత్, ఒమన్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనతో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందని నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ 'మైత్రీ పర్వ్' కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. అలాగే, ఇండియా-ఒమన్ బిజినెస్ ఫోరమ్లో పాల్గొని, ఒమన్ వ్యాపారవేత్తలు భారత్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.