Chandrababu Naidu: మరోసారి ఢిల్లీకి చంద్రబాబు.. కీలక అనుమతులపై దృష్టి

Chandrababu Naidu to Visit Delhi Again Focus on Key Permissions
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి హస్తిన పర్యటనకు సిద్ధమయ్యారు. రేపు ఆయన ఢిల్లీకి వెళుతున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీతో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి అత్యంత కీలకమైన నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించడమే ఈ పర్యటన ముఖ్యోద్దేశం.

ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి కోరనున్నట్లు సమాచారం. అదే సమయంలో, రాష్ట్రంలో కొత్తగా చేపట్టాలనుకుంటున్న నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్, కేంద్ర జల సంఘం అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు.

పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో కూడా సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతి, కొత్త ప్రాజెక్టుల ఆవశ్యకతపై ఆయనతో చర్చించనున్నారు. మరోవైపు, ఢిల్లీలో అందుబాటులో ఉన్న టీడీపీ ఎంపీలతో సమావేశమై, రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం కేంద్రంతో అనుసరించాల్సిన వ్యూహంపై వారికి దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటన ద్వారా పోలవరం పనులకు ఊపు రావడంతో పాటు, నూతన ప్రాజెక్టులకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తుందని రాజకీయ వర్గాలు ఆశిస్తున్నాయి.
Go Back to Shorts
Chandrababu Naidu
Andhra Pradesh
Polavaram Project
Nallamala Sagar Project
Central Water Commission
Water Resources
AP Irrigation Projects
PM Modi
Delhi Tour
VR Patil

More Telugu News