Donald Trump: అమెరికా సైనికులకు ట్రంప్ బంపర్ ఆఫర్.. క్రిస్మస్ కానుకగా 'వారియర్ డివిడెండ్'
- 14.5 లక్షల మందికి పైగా సైనికులకు క్రిస్మస్ కానుక
- ఒక్కొక్కరి ఖాతాలో 1,776 డాలర్లు జమ చేయనున్నట్టు వెల్లడి
- అమెరికా స్వాతంత్ర్య సంవత్సరం 1776కు గుర్తుగా ఈ మొత్తం
- సుంకాల ద్వారా వచ్చిన డబ్బుతోనే ఈ చెల్లింపులన్న ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక సిబ్బందికి భారీ క్రిస్మస్ కానుక ప్రకటించారు. 'వారియర్ డివిడెండ్' పేరుతో ప్రత్యేక నగదు చెల్లింపులు చేయనున్నట్టు వెల్లడించారు. దీని కింద సుమారు 14.5 లక్షల మంది సైనికులకు ఒక్కొక్కరికి 1,776 డాలర్లు (సుమారు రూ. 1.60లక్షలు) అందించనున్నట్టు తెలిపారు. దేశానికి సైనికులు చేస్తున్న సేవలు, త్యాగాలకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
బుధవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్, అమెరికా స్వాతంత్ర్య సంవత్సరం 1776కు గుర్తుగా ఈ మొత్తాన్ని నిర్ణయించినట్టు తెలిపారు. "విదేశీ ఉత్పత్తులపై విధించిన సుంకాలు, ఇటీవల ఆమోదం పొందిన బిల్లు ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చింది. ఆ డబ్బుతోనే మా సైనికులకు క్రిస్మస్ లోపు ఈ వారియర్ డివిడెండ్ను అందిస్తున్నాం. ఈ డబ్బుకు మన సైన్యం కన్నా ఎక్కువ అర్హులైన వారు ఎవరూ లేరు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. చెక్కులు పంపే ప్రక్రియ ఇప్పటికే మొదలైందని ఆయన వెల్లడించారు.
ఈ ఏడాది నవంబర్ 30 నాటికి యాక్టివ్ డ్యూటీలో ఉన్న సైనికులు, అధికారులు ఈ 'వారియర్ డివిడెండ్'కు అర్హులని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల కాలంలో ద్రవ్యోల్బణం, ఆర్థిక నిర్వహణపై విమర్శలు ఎదుర్కొంటున్న ట్రంప్.. ప్రజాదరణను పెంచుకునే వ్యూహంలో భాగంగానే ఈ ప్రకటన చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తన ప్రసంగంలో ఇమ్మిగ్రేషన్ విధానాలు, హౌసింగ్ సంస్కరణల గురించి కూడా ట్రంప్ ప్రస్తావించారు. తన సుంకాల విధానాన్ని గట్టిగా సమర్థించుకుంటూ, ఆ పదం తనకు ఎంతో ఇష్టమైనదని ఆయన పేర్కొన్నారు.
బుధవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్, అమెరికా స్వాతంత్ర్య సంవత్సరం 1776కు గుర్తుగా ఈ మొత్తాన్ని నిర్ణయించినట్టు తెలిపారు. "విదేశీ ఉత్పత్తులపై విధించిన సుంకాలు, ఇటీవల ఆమోదం పొందిన బిల్లు ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చింది. ఆ డబ్బుతోనే మా సైనికులకు క్రిస్మస్ లోపు ఈ వారియర్ డివిడెండ్ను అందిస్తున్నాం. ఈ డబ్బుకు మన సైన్యం కన్నా ఎక్కువ అర్హులైన వారు ఎవరూ లేరు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. చెక్కులు పంపే ప్రక్రియ ఇప్పటికే మొదలైందని ఆయన వెల్లడించారు.
ఈ ఏడాది నవంబర్ 30 నాటికి యాక్టివ్ డ్యూటీలో ఉన్న సైనికులు, అధికారులు ఈ 'వారియర్ డివిడెండ్'కు అర్హులని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల కాలంలో ద్రవ్యోల్బణం, ఆర్థిక నిర్వహణపై విమర్శలు ఎదుర్కొంటున్న ట్రంప్.. ప్రజాదరణను పెంచుకునే వ్యూహంలో భాగంగానే ఈ ప్రకటన చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తన ప్రసంగంలో ఇమ్మిగ్రేషన్ విధానాలు, హౌసింగ్ సంస్కరణల గురించి కూడా ట్రంప్ ప్రస్తావించారు. తన సుంకాల విధానాన్ని గట్టిగా సమర్థించుకుంటూ, ఆ పదం తనకు ఎంతో ఇష్టమైనదని ఆయన పేర్కొన్నారు.