మా ఆదివాసీ దేవుళ్ల జోలికొస్తే ఊరుకునేది లేదు: మంత్రి సీతక్క హెచ్చరిక
- రెండు విడతల పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయన్న మంత్రి
- ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటిందన్న సీతక్క
- పూర్తిస్థాయి నిధులు గ్రామాలకు అందాలనే ఉద్దేశంతో ఎన్నికలు నిర్వహించినట్లు వెల్లడి
తెలంగాణలో రెండు విడతల్లో ఇప్పటి వరకు 8,566 పంచాయతీల్లో ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయని అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటిందని ఆమె అన్నారు. గ్రామాలకు పూర్తిస్థాయి నిధులు అందాలనే ఉద్దేశంతో ఎన్నికలు నిర్వహించినట్లు తెలిపారు. బీసీ కులగణన ఆధారంగా 42 శాతం రిజర్వేషన్ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వంపై పోరాటం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు.
పదేళ్లు అధికారంలో ఉండి పది ఇళ్లయినా ఇవ్వలేదని బీఆర్ఎస్ పార్టీని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాదిన్నర కాలంలో కొన్ని వేల ఇళ్లను ఇచ్చిందని అన్నారు. మహిళలకు చీరలు, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, పేద పిల్లలకు గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలు వస్తే కొందరికి కళ్లమంటగా మారిందని విమర్శించారు. కొంతమంది నీచమైన రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.