భారత్ సహా 25 దేశాల్లో వీసా దరఖాస్తు కేంద్రాల్లో సర్వీసు ఫీజు పెంపు: న్యూజిలాండ్
- జనవరి 1 నుంచి కొన్ని కేంద్రాల్లో అమల్లోకి పెంపు నిర్ణయం
- నిర్వహణపరమైన వ్యయాలు, ద్రవ్యోల్భణం కారణంగా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
- వెల్లడించిన న్యూజిలాండ్ ఇమ్మిగ్రేషన్ డిపార్టుమెంట్
భారత్తో పాటు బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, పాకిస్థాన్, శ్రీలంక, సింగపూర్, జపాన్ తదితర 25 దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. వీసా దరఖాస్తు ఫీజుకు అదనంగా వీసా అప్లికేషన్ కేంద్రాలు వసూలు చేసే ఫీజు ఉంటుందని ఆ దేశ ఇమ్మిగ్రేషన్ డిపార్టుమెంట్ పేర్కొంది. ఇటీవల చేపట్టిన సిస్టమ్ అప్గ్రేడ్ల కారణంగా ఫీజు పెంపు చేపట్టవలసి వచ్చిందని తెలిపింది. దరఖాస్తులు సమర్పించే ముందు, ఫీజు వివరాలను సరిచూసుకోవాలని సూచించింది.