భారత్ సహా 25 దేశాల్లో వీసా దరఖాస్తు కేంద్రాల్లో సర్వీసు ఫీజు పెంపు: న్యూజిలాండ్

  • జనవరి 1 నుంచి కొన్ని కేంద్రాల్లో అమల్లోకి పెంపు నిర్ణయం
  • నిర్వహణపరమైన వ్యయాలు, ద్రవ్యోల్భణం కారణంగా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
  • వెల్లడించిన న్యూజిలాండ్ ఇమ్మిగ్రేషన్ డిపార్టుమెంట్
భారత్ సహా 25 దేశాల్లో వీసా దరఖాస్తు కేంద్రాల్లో వసూలు చేసే సర్వీసు ఫీజును పెంచుతున్నట్లు న్యూజిలాండ్ ప్రకటించింది. ఈ పెంపు జనవరి 1 నుంచి కొన్ని కేంద్రాల్లో అమల్లోకి రానుంది. నిర్వహణపరమైన వ్యయాలు, ద్రవ్యోల్భణం కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని న్యూజిలాండ్ ఇమ్మిగ్రేషన్ డిపార్ట్ మెంట్ వెల్లడించింది. న్యూజిలాండ్ వీసా కోసం ఇకముందు దరఖాస్తు చేసుకునేవారు ఈ మార్పును గమనించాలని సూచించారు.

భారత్‌తో పాటు బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, పాకిస్థాన్, శ్రీలంక, సింగపూర్, జపాన్ తదితర 25 దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. వీసా దరఖాస్తు ఫీజుకు అదనంగా వీసా అప్లికేషన్ కేంద్రాలు వసూలు చేసే ఫీజు ఉంటుందని ఆ దేశ ఇమ్మిగ్రేషన్ డిపార్టుమెంట్ పేర్కొంది. ఇటీవల చేపట్టిన సిస్టమ్ అప్‌గ్రేడ్‌ల కారణంగా ఫీజు పెంపు చేపట్టవలసి వచ్చిందని తెలిపింది. దరఖాస్తులు సమర్పించే ముందు, ఫీజు వివరాలను సరిచూసుకోవాలని సూచించింది.


More Telugu News