Amruta Fadnavis: మెస్సీతో సెల్ఫీ.. వివాదంలో మహారాష్ట్ర సీఎం భార్య
- భారత్లో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన
- ముంబై వాంఖడేలో సచిన్, ఛెత్రీలతో కలిసి ప్రత్యేక కార్యక్రమం
- సెల్ఫీతో వివాదంలో చిక్కుకున్న మహారాష్ట్ర సీఎం భార్య అమృత ఫడ్నవిస్
- చూయింగ్ గమ్ నములుతూ అగౌరవంగా ప్రవర్తించారని ఫ్యాన్స్ ఫైర్
- సోషల్ మీడియాలో వైరల్ అయిన అమృత సెల్ఫీ వీడియో
ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత పర్యటనలో ఊహించని వివాదం చోటుచేసుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృత ఫడ్నవిస్, మెస్సీతో సెల్ఫీ దిగిన తీరుపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ప్రవర్తన అగౌరవంగా ఉందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అసలేం జరిగిందంటే..!
మూడు రోజుల పర్యటన కోసం భారత్కు వచ్చిన మెస్సీ.. నిన్న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడు. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన "ప్రాజెక్ట్ మహాదేవ" అనే ఫుట్బాల్ అభివృద్ధి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించాడు. ఈ కార్యక్రమానికి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, భారత ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రీతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
అయితే, ఈ కార్యక్రమం సందర్భంగా అమృత ఫడ్నవిస్ ప్రవర్తన వివాదాస్పదమైంది. ఆమె పదేపదే మెస్సీతో సెల్ఫీల కోసం ప్రయత్నించడం, చూయింగ్ గమ్ నములుతూ ఫొటోలకు పోజులివ్వడం వంటివి ఒక వీడియోలో రికార్డ్ అయ్యాయి. మెస్సీ పక్కన నిలబడటం కోసం ఫుట్బాలర్ రోడ్రిగో డి పాల్ను పక్కకు జరగమని ఆమె కోరినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ వీడియో వైరల్ కావడంతో మెస్సీ అభిమానులు మండిపడుతున్నారు. అసలు ఆమెకు మైదానంలో ఏం పని అని, ఒక లెజెండరీ ఆటగాడి పట్ల ఇంత అగౌరవంగా ప్రవర్తిస్తారా అని ప్రశ్నిస్తున్నారు.
అనంతరం అమృత ఫడ్నవిస్, మెస్సీతో దిగిన ఫొటోను తన ఇన్స్టాగ్రామ్లో పంచుకోగా, దానిపై కూడా వ్యంగ్యాస్త్రాలు, విమర్శలతో కూడిన కామెంట్లు వెల్లువెత్తాయి. కాగా, మెస్సీ పర్యటనకు కోల్కతాలో నిర్వహణా లోపాలు ఎదురవగా, హైదరాబాద్లో మాత్రం ఏర్పాట్లు ప్రశంసలు అందుకున్నాయి. ముంబైలో జరిగిన ఈ తాజా ఘటనతో ఆయన పర్యటన మరోసారి వార్తల్లో నిలిచింది.
అసలేం జరిగిందంటే..!
మూడు రోజుల పర్యటన కోసం భారత్కు వచ్చిన మెస్సీ.. నిన్న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడు. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన "ప్రాజెక్ట్ మహాదేవ" అనే ఫుట్బాల్ అభివృద్ధి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించాడు. ఈ కార్యక్రమానికి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, భారత ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రీతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
అయితే, ఈ కార్యక్రమం సందర్భంగా అమృత ఫడ్నవిస్ ప్రవర్తన వివాదాస్పదమైంది. ఆమె పదేపదే మెస్సీతో సెల్ఫీల కోసం ప్రయత్నించడం, చూయింగ్ గమ్ నములుతూ ఫొటోలకు పోజులివ్వడం వంటివి ఒక వీడియోలో రికార్డ్ అయ్యాయి. మెస్సీ పక్కన నిలబడటం కోసం ఫుట్బాలర్ రోడ్రిగో డి పాల్ను పక్కకు జరగమని ఆమె కోరినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ వీడియో వైరల్ కావడంతో మెస్సీ అభిమానులు మండిపడుతున్నారు. అసలు ఆమెకు మైదానంలో ఏం పని అని, ఒక లెజెండరీ ఆటగాడి పట్ల ఇంత అగౌరవంగా ప్రవర్తిస్తారా అని ప్రశ్నిస్తున్నారు.
అనంతరం అమృత ఫడ్నవిస్, మెస్సీతో దిగిన ఫొటోను తన ఇన్స్టాగ్రామ్లో పంచుకోగా, దానిపై కూడా వ్యంగ్యాస్త్రాలు, విమర్శలతో కూడిన కామెంట్లు వెల్లువెత్తాయి. కాగా, మెస్సీ పర్యటనకు కోల్కతాలో నిర్వహణా లోపాలు ఎదురవగా, హైదరాబాద్లో మాత్రం ఏర్పాట్లు ప్రశంసలు అందుకున్నాయి. ముంబైలో జరిగిన ఈ తాజా ఘటనతో ఆయన పర్యటన మరోసారి వార్తల్లో నిలిచింది.