H-1B Visa: అమెరికా వీసా ఇంటర్వ్యూలకు కొత్త చిక్కు.. ఇక సోషల్ మీడియాపైనా నిఘా.. భారతీయ నిపుణులపై ప్రభావం?
- హెచ్-1బీ, హెచ్-4 వీసా దరఖాస్తుదారులకు కొత్త నిబంధనలు
- సోషల్ మీడియా ఖాతాలపై నిఘా పెట్టనున్న అమెరికా
- ప్రొఫైల్స్ను పబ్లిక్గా ఉంచాలని దరఖాస్తుదారులకు ఆదేశం
- జాతీయ భద్రతే కారణమంటున్న అమెరికా విదేశాంగ శాఖ
- భారతీయ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం
అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీ నిపుణులకు ట్రంప్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. హెచ్-1బీ (H-1B) వీసాతో పాటు దానిపై ఆధారపడిన హెచ్-4 (H-4) వీసా దరఖాస్తుదారుల స్క్రీనింగ్ ప్రక్రియను మరింత కఠినతరం చేసింది. ఇవాళ్టి నుంచి దరఖాస్తుదారుల సోషల్ మీడియా ప్రొఫైల్స్ను కూడా క్షుణ్ణంగా పరిశీలించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటికే విద్యార్థులు (F, M), ఎక్స్ఛేంజ్ విజిటర్స్ (J) వీసాలకు ఈ నిబంధన అమల్లో ఉండగా, ఇప్పుడు దానిని హెచ్-1బీ, హెచ్-4 వీసాలకు కూడా విస్తరించారు. ఈ తనిఖీలకు వీలుగా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ఖాతాల ప్రైవసీ సెట్టింగ్స్ను 'పబ్లిక్'గా మార్చుకోవాలని విదేశాంగ శాఖ స్పష్టంగా సూచించింది. ఈ కొత్త మార్గదర్శకాల నేపథ్యంలో ఇప్పటికే భారత్లో పలువురి హెచ్-1బీ వీసా ఇంటర్వ్యూలు వాయిదా పడినట్లు తెలుస్తోంది.
అమెరికా వీసా అనేది ఒక హక్కు కాదని, అదొక సదుపాయం మాత్రమేనని విదేశాంగ శాఖ పేర్కొంది. దేశ జాతీయ భద్రత, ప్రజా భద్రతకు ముప్పు కలిగించే వారిని గుర్తించేందుకే ఈ కఠిన నిబంధనలు అమలు చేస్తున్నామని తెలిపింది. ప్రతి వీసా జారీ ప్రక్రియను ఒక జాతీయ భద్రతాపరమైన నిర్ణయంగానే పరిగణిస్తామని పేర్కొంది.
వలసలపై ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యల్లో భాగంగానే ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చారు. హెచ్-1బీ వీసాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఇప్పటికే అనేక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ వీసాల ద్వారా లబ్ధి పొందుతున్న వారిలో భారతీయ టెక్ నిపుణులు, వైద్యులు అధిక సంఖ్యలో ఉన్నారు. తాజా నిర్ణయం వారిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇప్పటికే విద్యార్థులు (F, M), ఎక్స్ఛేంజ్ విజిటర్స్ (J) వీసాలకు ఈ నిబంధన అమల్లో ఉండగా, ఇప్పుడు దానిని హెచ్-1బీ, హెచ్-4 వీసాలకు కూడా విస్తరించారు. ఈ తనిఖీలకు వీలుగా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ఖాతాల ప్రైవసీ సెట్టింగ్స్ను 'పబ్లిక్'గా మార్చుకోవాలని విదేశాంగ శాఖ స్పష్టంగా సూచించింది. ఈ కొత్త మార్గదర్శకాల నేపథ్యంలో ఇప్పటికే భారత్లో పలువురి హెచ్-1బీ వీసా ఇంటర్వ్యూలు వాయిదా పడినట్లు తెలుస్తోంది.
అమెరికా వీసా అనేది ఒక హక్కు కాదని, అదొక సదుపాయం మాత్రమేనని విదేశాంగ శాఖ పేర్కొంది. దేశ జాతీయ భద్రత, ప్రజా భద్రతకు ముప్పు కలిగించే వారిని గుర్తించేందుకే ఈ కఠిన నిబంధనలు అమలు చేస్తున్నామని తెలిపింది. ప్రతి వీసా జారీ ప్రక్రియను ఒక జాతీయ భద్రతాపరమైన నిర్ణయంగానే పరిగణిస్తామని పేర్కొంది.
వలసలపై ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యల్లో భాగంగానే ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చారు. హెచ్-1బీ వీసాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఇప్పటికే అనేక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ వీసాల ద్వారా లబ్ధి పొందుతున్న వారిలో భారతీయ టెక్ నిపుణులు, వైద్యులు అధిక సంఖ్యలో ఉన్నారు. తాజా నిర్ణయం వారిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.