Nandamuri Balakrishna: నన్ను చూసుకునే నాకు పొగరు: 'అఖండ 2' వేడుకలో బాలకృష్ణ వ్యాఖ్యలు
- హైదరాబాద్లో అఖండ-2 విజయోత్సవ సభ
- ఈ సినిమాతో సనాతన ధర్మం మీసం మెలేసిందన్న బాలకృష్ణ
- నా వ్యక్తిత్వమే నన్ను నడిపించే విప్లవం అంటూ వ్యాఖ్యలు
- చరిత్రను తిరగరాసి తిరిగి చరిత్ర సృష్టించే వాడు ఒక్కడే అంటూ పవర్ ఫుల్ స్పీచ్
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన 'అఖండ 2' (అఖండ భారత్) చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా హైదరాబాద్లో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ఆకర్షణగా నిలిచిన బాలకృష్ణ, తన ప్రసంగంతో అభిమానుల్లో ఉత్సాహం నింపారు. సినిమా, సమాజం, సనాతన ధర్మం, తన వ్యక్తిత్వంపై ఆయన చేసిన వ్యాఖ్యలు హైలైట్గా నిలిచాయి.
ఈ సినిమాతో 'సనాతన హైందవ ధర్మం మీసం మెలేసింది' అని ప్రేక్షకులు అంటున్నారని బాలకృష్ణ అన్నారు. "మంత్రోచ్ఛారణ, వేదం, మన భారత దేశపు మూలాలు, మన ధర్మం, మన గర్వాన్ని కలగలిపిన సినిమా ఇది. ఇందులోని ప్రతి డైలాగ్ ఓ ఆణిముత్యం" అని కొనియాడారు. "ప్రకృతి, పిల్లల జోలికొస్తే దేవుడు ఏం చేస్తాడో 'అఖండ'లో చూపాం. అదే మనిషి దేవుడైతే ఎలా ఉంటుందో 'అఖండ 2'లో చూపించాం" అని చిత్ర కథాంశాన్ని వివరించారు.
తన పొగరు గురించి తరచూ వచ్చే విమర్శలపై బాలకృష్ణ తనదైన శైలిలో స్పందించారు. "ఎవరిని చూసుకుని బాలకృష్ణకు అంత పొగరు అంటారు? నన్ను చూసుకునే నాకు పదునైన పొగరు ఉంది. నా వ్యక్తిత్వమే నన్ను ఉసిగొలిపే విప్లవం. నన్ను నేను తెలుసుకోవడమే నాకు తెలిసిన గొప్ప విద్య" అని అన్నారు.
సినిమా తనకు ఉత్సాహాన్ని ఇస్తుందని, తన వృత్తే తనకు దైవమని బాలకృష్ణ తెలిపారు. "చరిత్రలో చాలా మంది ఉంటారు. కానీ సృష్టించిన చరిత్రను మళ్లీ మళ్లీ తిరగరాసి, తిరిగి చరిత్ర సృష్టించే వాడు ఒక్కడే. అదొక తెలియని శక్తి" అని వ్యాఖ్యానించారు. ఇది కేవలం తెలుగు సినిమా కాదని, ప్రపంచ సినిమా అని అభివర్ణించారు. చివరగా, ఈ భారీ విజయానికి కారణమైన చిత్ర బృందానికి, ప్రేక్షక దేవుళ్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సినిమాతో 'సనాతన హైందవ ధర్మం మీసం మెలేసింది' అని ప్రేక్షకులు అంటున్నారని బాలకృష్ణ అన్నారు. "మంత్రోచ్ఛారణ, వేదం, మన భారత దేశపు మూలాలు, మన ధర్మం, మన గర్వాన్ని కలగలిపిన సినిమా ఇది. ఇందులోని ప్రతి డైలాగ్ ఓ ఆణిముత్యం" అని కొనియాడారు. "ప్రకృతి, పిల్లల జోలికొస్తే దేవుడు ఏం చేస్తాడో 'అఖండ'లో చూపాం. అదే మనిషి దేవుడైతే ఎలా ఉంటుందో 'అఖండ 2'లో చూపించాం" అని చిత్ర కథాంశాన్ని వివరించారు.
తన పొగరు గురించి తరచూ వచ్చే విమర్శలపై బాలకృష్ణ తనదైన శైలిలో స్పందించారు. "ఎవరిని చూసుకుని బాలకృష్ణకు అంత పొగరు అంటారు? నన్ను చూసుకునే నాకు పదునైన పొగరు ఉంది. నా వ్యక్తిత్వమే నన్ను ఉసిగొలిపే విప్లవం. నన్ను నేను తెలుసుకోవడమే నాకు తెలిసిన గొప్ప విద్య" అని అన్నారు.
సినిమా తనకు ఉత్సాహాన్ని ఇస్తుందని, తన వృత్తే తనకు దైవమని బాలకృష్ణ తెలిపారు. "చరిత్రలో చాలా మంది ఉంటారు. కానీ సృష్టించిన చరిత్రను మళ్లీ మళ్లీ తిరగరాసి, తిరిగి చరిత్ర సృష్టించే వాడు ఒక్కడే. అదొక తెలియని శక్తి" అని వ్యాఖ్యానించారు. ఇది కేవలం తెలుగు సినిమా కాదని, ప్రపంచ సినిమా అని అభివర్ణించారు. చివరగా, ఈ భారీ విజయానికి కారణమైన చిత్ర బృందానికి, ప్రేక్షక దేవుళ్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.