తెలంగాణ రెండో విడత పంచాయతీ ఎన్నికలు... ఈసారి కూడా కాంగ్రెస్ దే జోరు
- తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఓట్ల లెక్కింపు
- భారీ ఆధిక్యంలో కాంగ్రెస్ మద్దతుదారులు
- సాయంత్రం 5 గంటల వరకు 600కు పైగా స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు
- రెండో స్థానంలో కొనసాగుతున్న బీఆర్ఎస్
- గ్రామీణ ప్రాంతాల్లో పట్టు నిలుపుకుంటున్న కాంగ్రెస్
రాష్ట్రంలోని 193 మండలాల పరిధిలో 3,911 గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులకు, 29,917 వార్డు సభ్యుల స్థానాలకు రెండో విడతలో ఎన్నికలు జరిగాయి. ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగిసిన వెంటనే లెక్కింపు ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. సాయంత్రం 8గంటల వరకు అందిన సమాచారం ప్రకారం, కాంగ్రెస్ మద్దతుదారులు 1,728 సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించారు. బీఆర్ఎస్ మద్దతు పొందిన అభ్యర్థులు 912 స్థానాల్లో గెలుపొందారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థులు సుమారు 201 స్థానాల్లో, ఇతరులు, స్వతంత్రులు 484 స్థానాల్లో గెలుపొందారు.
ఈ ఫలితాల సరళిని బట్టి గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ తన పట్టును మరింత బలోపేతం చేసుకుంటోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతుండటంతో, తుది ఫలితాలు వెలువడటానికి మరికొంత సమయం పట్టనుంది. పూర్తి ఫలితాలపై రాత్రికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.